తెలంగాణ

ఢిల్లీలో ధర్నా చేస్తా: విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: న్యాయ వ్యవస్థతోపాటు, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుడిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఇక్కడ జంతర్‌మంతర్ వద్ద విహెచ్ ధర్నా చేయనున్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో జడ్జిలుగా బిసిలు తక్కువమందే ఉన్నారని వాపోయారు. వెనుకబడిన వర్గానికే చెందిన ప్రధాని నరేంద్ర మోదీ న్యాయం చేస్తారనుకుంటే రెండేళ్లయినా బిసిలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పారు. తాను చేపట్టిన ధర్నాకు ఓబిసి ఎంపీలతో పాటు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్టు హనుమంతరావు తెలిపారు. బిసిల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదన్న విహెచ్ కాంగ్రెస్‌లోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగందని స్పష్టం చేశారు.