తెలంగాణ

కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: డ్రైనేజీ పనిలో కూలీల మృతిపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయనున్నట్టు చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూలీలతో పని చేయించిన ప్రైవేటు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యపై హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ప్రైవేటు వ్యక్తులతో డ్రైనేజీ శుభ్రం చేయించే ప్రయత్నం చేసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇకపై ప్రజలు ఎవరైనా డ్రైనేజీ కోసం ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో సాధ్యమైనంత వరకు మిషన్ల సహాయంతో డ్రైనేజీ శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకున్నా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.