తెలంగాణ

జాకారంలో గిరిజన వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: వచ్చే విద్యాసంవత్సరం (2018-19) నుండి ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్‌లోని మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లో చెప్పారు. ఈ రెండింటిలో 2018 జూన్ నుండి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం నాడు కడియం శ్రీహరి గిరిజన వర్శిటీ, వెటర్నరీ కాలేజీల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని అధికారులు ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని సందర్శించారని, కాలేజీ కోసం 2016లో తెలంగాణ ప్రభుత్వం పివి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ కాలేజీకి ఆరు కోట్ల రూపాయల పరిపాలనా మంజూరు ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కాలేజీల భవనాలు, వౌలిక సదుపాయాలు, ల్యాబ్‌ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 2017లో 109.69 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇప్పటికే భవనాలకు శంకుస్థాపనలు చేశామని, వీటి నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం తరగతులు కూడా ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కావాలని కడియం శ్రీహరి సూచించారు. ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన కేబ్ సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయం గురించి మాట్లాడానని అన్నారు. అయితే యూనివర్శిటీకి భూమి కేటాయింపు అంశాన్ని కేంద్ర అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా గిరిజన యూనివర్శిటీకి ములుగు జాకారంలో 169 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే సర్వే నెంబర్‌లో సేకరించామని వివరించారు. అదే విధంగా 213 ఎకరాల భూమి ఫారెస్టు ల్యాండ్ ఉందని, దీనిని సర్వే చేసి అటవీ అధికారులు కూడా త్వరలో అప్పగించనున్నారని అన్నారు. వచ్చే నెలలో కేంద్ర బృందం యూనివర్శిటీ ప్రాంతాన్ని సందర్శించనుందని అన్నారు. దీంతో వెంటనే ఆ భూమిని సేకరించిన విషయం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దృష్టికి తేవాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గిరిజన వర్శిటీ పనులను అనునిత్యం పర్యవేక్షించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి జబల్‌పూర్ గిరిజన వర్శిటీ వైస్ ఛాన్సలర్ కూడా వచ్చారని, తాను తెలంగాణ ట్రైబల్ వర్శిటీ గురించి అడిగిన నేపథ్యంలో ఆయన తమ వర్శిటీని చూడాలని కోరారని అన్నారు. వచ్చే నెలలో జబల్‌పూర్ గిరిజన వర్శిటీని చూడడానికి వెళ్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.