తెలంగాణ

భూపాలపల్లి అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాయంపేట, జనవరి 19: భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారి అన్నారు.
మండలంలోని కొప్పుల గ్రామం లో గురువారం రాత్రి ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌లో స్పీకర్ పల్లెప్రగతి నిద్ర చేశారు. గ్రామస్థులు డప్పుచప్పుళ్లు, కోలాటాలతో స్పీకర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం పదిలక్షల రూపాయలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉద యం గ్రామస్థులు, ప్రజాపతినిధులతో సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలపై విద్యార్థులతో ముచ్చటించారు.
గ్రామస్థులు వ్యక్తిగత సమస్యలు, అరోగ్య సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడిక్కక్కడే పరిష్కరించారు.

చిత్రం..కొప్పుల గ్రామంలో పల్లెనిద్ర చేస్తున్న స్పీకర్ మధుసూదనచారి