తెలంగాణ

గవర్నర్ హుందాగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: గవర్నర్ నరసింహన్ రాజకీయాలకు అతీతంగా హుందాగా వ్యవహరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. సోమవారం ఢిల్లీలో పొంగులేటి విలేఖరులతో మాట్లాడుతూ గవర్నర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించినందుకు ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే రాజకీయంగా మాట్లాడుకునే అవకాశం గవర్నర్ కల్పించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్రాలకు కేంద్రంనుంచి రావాల్సిన అంశాలపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలం చెందిందని పొంగులేటి మండిపడ్డారు.