ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో పదిమంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పదిమంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విధ్వంసానికి సాక్షీభూతంగా నిలిచిన సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కడప, గుంటూరుకు చెందిన కొందరు విధ్వంసంలో పాల్గొన్నట్టు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని తెలిసింది. త్వరలోనే మరికొంతమంది నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.