ఆంధ్రప్రదేశ్‌

ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడీ ప్రారంభించారు. విశాఖపట్నంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏసీ, డైనింగ్ సదుపాయం, టీవీ ఎనౌన్స్‌మెంట్ వంటి అత్యాధునిక సదుపాయలు ఉన్న ఈ రైలులో నేడు పరుగులు ఆరంభించింది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభించారు. టికెట్ ధర రూ.525లుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.