జాతీయ వార్తలు

ఉన్నావ్ బాధితురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నావ్ బాధితురాలు కన్నుమూసింది. నాకు బతకాలని ఉంది అంటూ ఆక్రోసించిన అభాగ్యురాలు ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11.45 నిమిషాలకు గుండెపోటుతో మృతి చెందింది. రాయ్‌బరేలి కోర్టుకు వెళుతుండగా ఉన్నావ్ జిల్లా సింధూపూర్ వద్ద ఆమెపై దాడి జరిగింది. దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. బతకాలనే ఆశతో ఆమె కొద్దిదూరం మంటలు వ్యాపించినా పరుగెత్తటం అందరినీ కలిచివేసింది. బాధితురాలిని లక్నో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి వాయుమార్గంలో తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. కాగాతనపై అత్యాచారం చేసి, దాడిచేసి నిప్పుపెట్టినవారి పేర్లు బాధితురాలు మేజిస్ట్రేట్‌కు వివరించింది.