జాతీయ వార్తలు

యూపీలో భారీ వర్షాలు: 15మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలకు 15మంది చనిపోగా.. జంతు, ఆస్తి నష్టం అధికంగా ఉంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉన్నావూ, అంబేడ్కర్‌ నగర్‌, గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, హర్దోయ్‌, కాన్పూర్‌ నగర్‌, పిలిభిట్‌, సోనాభద్ర, చందోలి, ఫిరోజాబాద్‌, మావూ, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు 133 భవనాలు నేల కూలినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఐదు రోజులుపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.