తెలంగాణ

మోదీజీ.. మిషన్ భగీరథను ప్రారంభించవద్దు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పర్యటన సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించవద్దని కోరుతూ టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రధాని మోదీకి గురువారం బహిరంగ లేఖ రాశారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడం సరికాదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నపుడు వౌలానా అబ్దుల్ కలాం అజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి- హైదరాబాద్ ప్రాజెక్టుకు ఇపుడు మిషన్ భగీరథ అంటూ తెలంగాణ సర్కారు పేరు మార్చిందన్నారు. ప్రధాని పర్యటనను తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టును ప్రారంభించడంలో ఔచిత్యం లేదన్నారు. తెలంగాణకు తగినన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరారు.