విజయవాడ

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఎంపీ నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 10: స్వస్థ కుటుంబం, టెలీ మెడిసిన్ సెంటర్లు, ఇంటర్నెట్ సాథి పథకాల ద్వారా పేదవారి జీవితాల్లో ఎంపీ నాని వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కొనియాడారు. పార్లమెంటు నియోజకవర్గంలోని రైతులకు ఎంపీ కేశినేని నాని మూడో విడతగా ఎన్టీఆర్ రైతు రథం ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కేశినేని భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎంపీ కేశినేని నాని కలిసి 12ట్రాక్టర్లను రైతులకు అందచేశారు. ఈసందర్భంగా బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు రైతు రథం ట్రాక్టర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను నగరానికి తీసుకువచ్చి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్, రాష్ట్ర కార్యదర్శి గనే్న వెంకట నారాయణ ప్రసాద్ (అన్నా), అర్బన్ ఉపాధ్యక్షులు శివరామప్రసాద్, సీనియర్ నాయకులు కాట్రగడ్డ బాబు, కో ఆప్షన్ సభ్యులు ఫతావుల్లా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.