జాతీయ వార్తలు

9న సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిధుల స్తంభన’పై సుప్రీంకోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్ 30: ఉన్నత విద్యామండలి విషయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదంపై వచ్చే నెల తొమ్మిదన సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. న్యాయమూర్తులు విక్రంజిత్ సేన్, శివకీర్తీసింగ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉన్నత విద్యామండలి నిధులను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపచేయటంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం నిధులను స్తంభింప చేయటంతో జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. నిధులను స్తంభింపచేస్తే జీతాలు ఎలా చెల్లిస్తారని న్యాయమూర్తి సేన్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్ 9న సమగ్ర విచారణ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.