జాతీయ వార్తలు

సెప్టెంబర్‌లోగా బకాయిలు తీరుస్తా: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వివిధ బ్యాంకులకు తాను బకాయిపడిన నాలుగువేల కోట్ల రూపాయలను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని, ఈ మేరకు తనకు గడువు ఇవ్వాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుప్రీం కోర్టును కోరారు. లండన్‌లో ఉంటున్న ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు బుధవారం విచారించింది. మాల్యా చేసిన ఈ ప్రతిపాదనపై వారంలోగా స్పందించాలని బ్యాంకుల కన్సార్టియంను ఆదేశిస్తూ కేసు విచారణను ఏప్రిల్ 7కు సుప్రీం వాయిదా వేసింది. తాను దేశం విడిచి పారిపోలేదని, ప్రముఖ వ్యాపారిని గనుక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తుంటానని మాల్యా ఇటీవల ‘ట్విట్టర్’లో పేర్కొన్న సంగతి తెలిసిందే.