వినమరుగైన

ఆధునిక మహాభారతము - గుంటూరు శేషేంద్ర శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విధి నా చేతికిచ్చిన విషపాత్రిక నగరం
ఇక్కడే వెయ్యిసార్లు నా లోకాల్ని కోల్పోయా’’
కవికి మానవ నాగరితా పరిణామంలో తాను ప్రజలు- నగరం- ప్రకృతి మధ్య లోపించిన ఆత్మీయ సమతుల్యాన్ని తిరిగి పొందే తీవ్ర వాంఛ వ్యక్తపరుస్తాడు.
‘‘రాళ్ళ కన్నీళ్లు వ్యాపించిన ఈ భూములపైన వేస్తాడు ఒకడు- ఇనుప కండరాల దేహంమీద సుళ్లు తిరిగేము’’-
అని అంటూ
‘‘అరే నా దేశంలోనే నా గొంతు పరాయిదైపోయిందే’’ అని బాధపడతాడు.
‘‘అరే ఈ గుంపుకు ఎలా మేల్కొనాలో తెలియదు-
ఎలా బాహువులు చాపి తన ఇనుపకాళ్లు
ఇలాతలంలో మోపాలని తెలియదు’’
నా దేశం - నా ప్రజలు అన్న ఒక్క పర్వంలోనే ఆధునిక మహాభారత హృదయం ఉంది. అయితే కవి ప్రేయసిని మధ్యలో సంబోధించుకుంటూ తనలోని భావాలకు ఆనందపు రుచి కలిగిస్తాడు. బహుశా కావ్యంలో నాయకునితోపాటు నాయకి కూడా ఉండాలనే సాంప్రదాయిక స్పృహేమో అయినా ప్రాచీన కావ్యనిర్మాణ పరిస్థితులని దీంట్లో వెదకడం తప్పు. భౌతిక రూపం మాత్రం ఆశ్వాసాంత గద్య, విభజించిన సర్గలో మాత్రం సంప్రదాయ పరిమళాల్ని నింపుకున్నాయి.
ఇక సూర్యపర్వం. సూర్య ప్రతీకగా సాగుతుంది.
‘‘నోటినిండా సూర్యుణ్ణి కొరుక్కు తింటున్నా-
పెదవుల కొసల నుంచి ఎర్ర కాంతులు రసం జారిపడుతోంది
అడవుల్లో సంచరిస్తూ దారి తప్పిన లంబాడీ ఒంటరితనం
నా యెదుట పడ్డాయి’’
‘‘కొండల విశ్శబ్దాన్ని బొట్లు బొట్లుగా చప్పరిస్తున్నపుడు చప్పుడు చేసే నా గుండెను కూడా క్షమించలేను’’ అంటాడు కవి.
సహజ కృత్రిమాల మధ్య జరిగే సంఘర్షణ కవిలోంచి అప్రయత్నంగా తన్నుకొని వస్తుంది.
ఆకాశాలు ఒరిసే అడవుల నిశ్శబ్దంలో
చెట్లని ముక్కుతో కొట్టి
శబ్దాలు ప్రతిధ్వనింపజేసే వడ్రంగి పక్షి
క్రోటన్ మొక్కల్లో ఏం చేస్తుంది?
ఇందు కవి వడ్రంగి పక్షిలా కనపడతాడు
‘‘పళ్లు తిన్నట్లు దినాలు తిన్న నేను
ద్రాక్ష పళ్లంత కన్నీటి బిందువులు తింటున్నాను’’
చెప్పే భావాన్ని ఆకర్షణీయమైన అభివ్యక్తి కావ్య పరిభాష మింగేస్తుందేమో అన్న భయం కలుగుతుంది. ఫలితంగా శేషేంద్ర శైలి బాగా వుంది. గొప్ప ఎక్స్‌ప్రెషన్ అని ఆపేవేస్తే ప్రతిపాదించిన మూల సిద్ధాంతాన్ని విస్మరించే ప్రమాదం వాటిల్లింది.
చలం ఎప్పుడో ఒకసారి అన్నారట.
‘‘ఎవడైనా వచ్చి ‘చలంగారూ మీ శైలి అమోఘంగా వుంది’ అన్నాడంటే- వాడే తన రచనలకు ప్రథమ శత్రువు’’ అని. అదే శేషేంద్రకు వర్తిస్తుంది. శేషేంద్ర సభలలో కవిత్వానికి చప్పట్లు కొట్టిన చేతులు- ఆ చేతులలోంచి చేతనలోకి ఎంత అనుభూతి ప్రసరించింది అనేది ఆలోచించాలి.
ప్రతి పర్వంలో ప్రతి వాక్యమూ కవితా పౌష్కల్యంతో ఉక్కిరి బిక్కిరవుతుంది.
‘‘మరణించి నదులు మాట్లాడతాయి/ మూసీ నదిలా/ మీసాలొస్తే గాలి తుపానుగా మారుతుంది/ అతనితోపాటు అతని స్వప్నాలు కూడా
కాలుతున్న పరిమళం/ అతడు ఒక శతాబ్దంపై నిల్చున్న వీరుడు’’
అది ఆద్మ పర్వంలో వుంది. అసలు ఆద్మ పర్వం ఆనడమే కొత్త. సమాసాల వ్యాకరణ సూత్రాలు తెలిసిన శేషేంద్ర తన కవిత్వంలో సూత్రాలు భేదించుకొని పద ప్రయోగాలు చేస్తాడు.
మానవ జీవిత పొలాలు, పురాతన గొంతు, విశాల కిటికీ, కఠోర తుపాను, పురాతన అడవి ఇలా కావాలనే ప్రయోగిస్తాడు శేషేంద్ర. కారణం అభివక్తి అడ్డం వచ్చే వ్యాకరణాన్ని కాళ్ళతో తొక్కగల సాహసం లేకపోతే
‘శ్రీమన్మంగళ కల్కిమూర్తి పరిశుష్క్భిత ధర్మావనో
ద్దామక్షేత్ర పవిత్ర కీర్తి ఘన ధారా ఘోర ఖడ్గమ్మునన్
భూమీ జీవ పరిశ్రమాహరణ సంభూతార్థ గర్వాంధులన్
గ్రామ గ్రామ కబంధులన్ బిలిచి సత్కారంబుగావించుతన్
వంటి దీర్ఘ సమాసాలు గల పద్యాలు రాసిన కవికి, ఆద్మపర్వం వంటి పదాలు కొత్త అభివ్యక్తికోసమే.
శేషేంద్ర ప్రేమ కవిత్వంలోను, ఉద్యమస్ఫూర్తినందించే కవిత్వంలోను, అంతశే్చతనను సృజించే కవిత్వంలోను అభివ్యక్తికి ప్రాధాన్యం ఇస్తాడు. కొత్త కొత్త ఉపమలు, కొంగ్రొత్త రూపకాలు పద చిత్రాలు ప్రయోగిస్తాడు.
సూర్యుడు, సముద్రాల మీద వంగి
నీళ్లు తాగే గుర్రం
ఆకాశం నగరాల మీది వంగి గర్జించే సింహం
భూమి శూన్యంలో తిరిగే
బొంగరం
జీవితం మనం అడగకుండా వచ్చిన సంగరం
ఆశ్చర్యం కలిగించే కావ్య పరిభాషను ఈ శతాబ్దానికి ఇచ్చిన విలక్షణమైన కవిగా శేషేంద్ర మిగులుతారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి.. -సశేషం

-రాళ్లబండి కవితాప్రసాద్