వినమరుగైన

పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదీ విచిత్రం! ఐతే శిఖరాగ్రం చేరుకున్నాక, అధిరోహించేందుకు మరేమీ లేనప్పుడు జరిగే పరిణామమేమిటి? నింగికి దూసుకుపోయిన తోకచుక్క నేలకు రాలక తప్పదుగదా!
మంజరి జీవిత చరమాంకం ఆ దశనే గుర్తుచేస్తుంది.
ఆ క్రమానుగత పరిణామాన్ని, వెండితెర వెనుక భాగోతాలను, కుట్రలు, కుతంత్రాలను, విశ్వసనీయతతో, నిశిత దృష్టితో, మనకళ్లముందుంచేందుకు భరద్వాజ గారు చిత్తశుద్ధితో చేసిన సద్యత్నమే పాకుడురాళ్లు.
తనకు ఆ నవల ఎందుకు నచ్చిందో ఆలపాటి వెంకట్రామయ్యగారు 1963లో ముందుమాటగా ఇలా వివరించారు. సినిమా వెనుకగల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమేగాదు.
జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్న వేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో పోహళించడం కూడా కాదు.. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా భాసిస్తూ, వేలాది మందిని తన వైపునకు ఆకర్షించే ఈ రంగంలో పాతుకుపోయిన అవాంఛనీయమైన శక్తులను గురించి రచయిత మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు.
చిరునవ్వుల వెనుక మణిగిపోయే ఆత్మఘోష, తళుకు చూపుల చాటున దాగిన కన్నీరు, తియ్యని మాటలమాటున పొంచి వున్న విషజ్వాలలు మనకు ఈ నవలలో ప్రత్యక్షమవుతాయి.
నిజం. ప్రతి మాటా అక్షరసత్యం. అత్యుక్తికి తావే లేదు. ఇంతటి వాస్తవికతను, కఠోర సత్యాల్ని నింపుకున్న నవల గనుకే తెర వెనుక సినీ జీవితాల్లోని వెలుగునీడలకు అద్దంపట్టిన ప్రామాణిక గ్రంథంగా మన్నన పొందింది; సాహితీ లోకానికి ఎనలేని సేవ చేసింది; కాలపరీక్షకు నిలువగలిగింది.
అంతటి ప్రామాణిక గ్రంథానికి కేంద్ర బిందువు మంజరి. ఎన్నో పాత్రలు మంజరి చుట్టూ పరిభ్రమిస్తాయి. ముఖ్యంగా ఎన్నదగినవాడు చలపతి.
అడుగడుగునా తనతో వుంటూ, తనకు అంతరంగికులుగా, మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించిన సహనాయిక కళ్యాణి, తన పూర్వాశ్రమమైన వెలయాలి జీవితంలో తోడుగా వుండిన రాజమణి తన ద్వారా గాయనిగా సినీరంగ ప్రవేశం చేసిన వసంత, కథానాయకులు, ప్రత్యర్థులైన రావు, మూర్తి, చంద్రం, పాత్రికేయుడు శర్మ. తన శరీర లావణ్యాన్ని వాడుకుని తోడ్పడిన నిర్మాతలు, పంపిణీదారులు, తన కత్యంత విశ్వాసపాత్రురాలైన పనిమనిషి తాయారమ్మ. మంజరి నట జీవిత ప్రారంభంలోనూ, అంత్య దశలోనూ విశిష్ట స్థానంలో నిలిచిన మాధవరావు మినహా మిగిలినవారందరూ చదరంగం పావుల్లాంటివాళ్లు.
మగవాడి బలహీనతలేమిటో, ఎప్పుడు వాటిని లాభసాటిగా వాడుకోవాలో మంజరికి క్షుణ్ణంగా తెలుసు.
అందుకే సినీ వ్యాపారస్తులను వ్యామోహంలో ముంచి, ప్రతి ఒక్కడికీ తను స్వంతమన్నట్టు నమ్మించి తన పబ్బం గడుపుకోగలిగిన జాణ ఆమె. తన జీవితంలో అడుగడుగునా తిన్న దెబ్బలు, అనుభవించిన నరకయాతన, మంజరి జీవితాన్ని తీర్చిదిద్దాయి. అనుభవాల నుంచి జీవరసాన్ని పీల్చుకుని, తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకున్న నేర్పరి.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..