వినమరుగైన

పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాంతో సజావైన మార్గానికన్నా డొంక తిరుగుడు దోవకే విలువ ఎక్కువవుతోంది. నాడూ, నేడూ, సినిమా పద్మవ్యూహంలో ప్రవేశించాక, అక్కడ ఇమడలేక, బయటపడలేక, నశించినవారి సంఖ్య పెద్దదే.
ఇప్పుడైతే లేరు గానీ, టాకీయుగం కౌమార దశలో వేంప్స్-అంటే వగలాడి వయ్యారిభామలకు ప్రాబల్యముండేది. వాళ్లనే వనె్నల విసనకర్రలని పిలిచేవారు. ఇపుడు కథానాయికకూ, వేంప్‌కూ తేడా ఏమీ లేదనుకోండి. జ్యోతిలక్ష్మి, హలం వంటివారు పోషించిన పాత్రలీనాటి తారామణులలో లీనమైపోయాయి గదా. అలాగే హేమమాలిని, వైజయంతీమాల వంటి దక్షిణాది తారలు అప్పటి హిందీ సినిమా రంగంలో వెలిగిపోతే రుూ రోజుల్లో తెలుగుతెరమీద తెలుగురాని ఆంధ్రేతర తారలు ఇలా వెలిగి అలా మాయమైపోతున్నారు.
అలాంటి స్వల్పకాలిక తారలీనాడు నిర్మాతల్నీ, దర్శకుల్నీ శాసించలేకపోయినా, 50-60 దశకాలలో ‘స్టార్ సిస్టమ్’ ఆవిర్భవించడంతో, అగ్ర నటీనటులు తమ ఆధిక్యాన్ని పెంచుకోగలిగారు. కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులు, నాగిరెడ్డి వంటి నిర్మాతల వద్ద మాత్రం, వాళ్ళు తమ పరిధుల్లో వుండేవారు.
వీరందరినీ మించి ఆ రోజుల్లో పంపిణీదారుదే చివరిమాటగా వుండేది.
చిత్ర నిర్మాణం విషయంలో జెమినీ, ఎవిఎం, వాహిని, విజయ, శోభనాచల వంటి పెద్ద నిర్మాతలు మినహాయిస్తే, మిగిలిన చిత్ర నిర్మాతలు పెట్టుబడి కోసం డిస్ట్రిబ్యూటర్‌ని ఆశ్రయించక తప్పేదిగాదు. దాంతో పూర్ణా, నవయుగ, చమ్రియా వంటి ప్రధాన డిస్ట్రిబ్యూటర్స్ రారాజుల్లా తమ మాట చెల్లించుకోగలిగేవారు.
అన్ని గ్రహాలు వారి చుట్టే ప్రదక్షిణచేసేవి. అకారణంగా సాంఘికాలన్నా పౌరాణిక, చారిత్రక చిత్రాల సంఖ్యే ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేదంటే ఆశ్చర్యమేమీ లేదు.
ఐనప్పటికీ సినిమా అన్నది ఒక కళా మాధ్యమం అన్న విషయాన్ని సంస్కారవంతులైన అప్పటి దర్శక నిర్మాతలు విస్మరించలేదు. ముందుగానే కథా సంవిధానం సిద్ధం చేసుకుని, సర్వసన్నద్ధంగా చిత్ర నిర్మాణానికుపక్రమించేవారు.
షూటింగ్ ఆషామాషీగా, ద్రువ గమనంతో గాక, సాఫీగా, ఒక పథకం ప్రకారం సాగేది గనుకే అపజయాలంతగా వుండేవి గావు. సినీ జగత్తులో సంభవించే గాలివానలు, ఎదురయ్యే సుడిగుండాలు వారికి అధిగమించరాని అవరోధాలుగా వుండేవిగావు.
చివరిమాటగా చెప్పాలంటే పరస్పర వైరుధ్యాలతో, చీకటి వెలుగులతో ఆనాటి సినీ జీవుల ఉత్థాన పతనాలతో, సమ్మిళితమైన ఆనాటి సినీ జగత్తు సమగ్ర చిత్రాన్ని ప్రప్రథమంగా మన ముందుంచగలిగిన పరిపూర్ణ నవల పాకుడురాళ్లు.
రచయిత అవగాహన, విశే్లషణ, చిత్రణ గ్రంథాన్ని సమున్నత స్థానంలో నిలిపాయి. దురభిప్రాయాలకూ, దురభిమానానికీ తావు లేకుండా, సానుభూతితో, సదాశయంతో సాగిన రచన కారణంగా దానికంతటి ఉత్కృష్టత. అందుకు డాక్టర్ రావూరి భరద్వాజ బహుధా అభినందనీయులు.

-పి.యస్.రావు