వినమరుగైన

మరీచిక -వాసిరెడ్డి సీతాదేవిరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెదపట్టిన నిత్య జీవిత పుస్తకం పుట లక్షణాలనుంచీ కట్టుకొయ్యక్కట్టిన పశువుల్లాటి విసుగెత్తించే రోజుల్నుంచీ, రూపాయిల వాసన వేసే మనుషులనుంచీ, బిగుసుకుపోయిన పొడిబారిన ముఖాలనుంచీ తప్పించుకొని కాసేపు సంతోషంగా గడపాలంటే సాహిత్యమే శరణ్యం.
ఏ దేశ సంస్కృతిని తెలుసుకోవాలన్నా ఆ దేశ సాహిత్యం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. నిజమైన సాహిత్యం ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూనే వుంటుంది. ఆనాటి భారతం, రామాయణం ఈనాటికీ నిలిచి వున్నాయంటే సమాజ చిత్రణను అద్దంలా ప్రతిఫలించడమే ముఖ్య కారణం. సమాజంలోనైనా, సాహిత్యంలోనైనా పురుషాధిక్యత అనూచానంగా వస్తూనే వుంది. 18వ శతాబ్దం వరకు పుంఖానుపుంఖాలుగా వున్న రచయితలలో ఏ మొల్లో, ముద్దుపళనో తప్ప మరొక రచయిత్రి లేదు. ఒకప్పుడు స్ర్తికి ‘‘విద్య అవసరమా! అనవసరమా!’’ అనే విషయం చర్చనీయాంశం అయిందంటే మనిషికి తప్పనిసరయిన ప్రాథమికావసరాలు కూడా స్ర్తివిషయం వచ్చేసరికి పోరాడితేగాని సాధ్యపడని పరిస్థితి సంఘంలో ఉన్నదని తెలుస్తూనే వుంది. కందుకూరి వీరేశలింగం, రాజారామ మోహనరాయ్ మొదలగువారు స్ర్తి విద్య ఆవశ్యకతను గూర్చినొక్కి చెప్పినాక స్ర్తిలు విద్యావంతులైనారు. ఉద్యోగస్థులైనారు. స్వేచ్ఛ రెక్కలు తొడుక్కున్నారు.
అరవయ్యవ దశకంలో రచయిత్రుల యుగం వచ్చినట్లే అనిపిస్తుంది. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి మొదలగువారందరు ఆనాటి వారపత్రికల్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలారు. ఆనాడు కొందరు పురుష రచయితలు కూడా స్ర్తిల పేర్లు పెట్టి పత్రికలకు రచనలు పంపించారంటే ఆనాటి రచయిత్రుల వైభవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ అప్పటి స్ర్తిల సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల సాహిత్యమని వంకరగా పలికారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆలోచిస్తే ఆనాటి రచయిత్రులు వాళ్లకు పరిమతమైన ప్రపంచాన్ని గురించే సహజంగా వర్ణించారు. పాఠకులు వాళ్లకు నీరాజనాలిచ్చారు.
అలాటి రచయిత్రుల యుగంలో విభిన్నమైన వస్తువుల్ని తీసుకొని ఆనాటి సమాజాన్ని తన రచనలలో ఆవిష్కరించిన వ్యక్తి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి.
వీరు గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో 1932లో జన్మించారు. 39 నవలలు, 9 కథా సంపుటాలు, 3 వ్యాస సంపుటాలు ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, మద్రాసు తెలుగు అకాడమీ మొదలగు ఇరవై సంస్థల నుండి అవార్డులు అందుకొన్నారు.
ఈమె పరదా పద్ధతి పాటించే అతి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెళ్లి చేస్తామంటే తిరస్కరించి, బయటకు వచ్చి స్వయంకృషితో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ రంగంలో ఎన్నో ఉన్నతోద్యోగాలు చేశారు.
సీతాదేవి లెక్కకు మించి ఎన్ని రచనలు చేసిన ఆవిడకు ప్రధానంగా కీర్తి తెచ్చిపెట్టినవి నవలలే. ఈవిడ రచించిన మట్టిమనిషి 14 భాషల్లో అనువాదమైతే, మరీచిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిషేధానికి గురైంది.
తోటి రచయిత్రులు కుటుంబ వృత్తాంతాన్ని, ప్రేమకథల్ని ఇతివృత్తంగా తీసికొంటే సీతాదేవిగారు మాత్రం సంక్షుభితమైన సమస్యలతో అల్లకల్లోలమైన సంఘాన్ని తన రచనలకు ఇతివృత్తంగా ఎన్నుకొన్నారు.
పితృస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ సమాజంలోని లోపాలను తన కలంకత్తితో చీల్చి చెండాడుతూ, సజీవమైన పాత్రల్ని సృష్టించి, సంఘం వీపుపై చెర్నాకోల దెబ్బలవంటి నవలల్ని రాశారు. అలాటి నవలే మరీచిక.
ఈ నవల 89లో మొదటి ముద్రణ పొందింది. తర్వాత 82, 83, 85, 95, 2000లలో మలి ముద్రణలు పొందింది. పుస్తకంగా రాకముందు ఈ నవల 1978లో ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. ప్రభుత్వానికి అభ్యంతకర విషయాలున్నాయని 82లో దీన్ని నిషేధించారు. ఈ నిషేధానికి వ్యతిరేకంగా అందరూ పోరాడిన తరువాత ఈ నిషేధాన్ని ఎత్తేశారు.రెండు దశాబ్దాల కిందట యువతరాన్ని పట్టి పీడించిన హిప్పీయిజం, నక్సలిజం సమస్యల గురించి, విద్యార్థులపై వాటి దుష్ప్రభావం గురించీ, దీనికంతటికీ కారణమైన అస్తవ్యస్తమైన సంఘం గురించీ ఎక్కుపెట్టిన బాణమే మరీచిక నవల.ఏ సమాజానికైనా యువతరం జీవగర్ర వంటివారు. దేశాన్నిగానీ, సంఘాన్ని గానీ ఉన్నత పథాలవైపు తీసుకువెళ్లాలన్నా అధోగతిలో పడేయాలన్నా వారే ముఖ్యకారకులు. ఆనాడు భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో ఎంతోమంది యువకులు చదువులు వదిలేసి ఉద్యోగాలు తృణీకరించి జీవితాలను దేశం కోసం అర్పించారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మందరపు హైమావతి