వినమరుగైన

మరీచిక -వాసిరెడ్డి సీతాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ నా కొడుకు బతికే ఉన్నాడు. నేను చేసిన వడ్డీ వ్యాపారమే వాడూ చేస్తాడు. నా ఆస్తి దోచేస్తే తరిగేది కాదు. నా భూమి నాకే వుంది.
నువ్వు నమ్ముకొన్న జనం నీ వెంట రారు. నావైపు ప్రభుత్వం ఉంది. సిఆర్‌పి వుంది. నువ్వు ననే్నం చెయ్యలేవు’’ అంటుంది.
ఈ ఉద్యమంలోకి వచ్చేటపుడు జ్యోతి, సత్యం కృష్ణానదిపై పడవ దాటుతుంటారు. కృష్ణకు బాగా వరద వచ్చినపుడు సత్యం ‘‘నీకు ఈత వచ్చా!’’ అని జ్యోతిని అడుగుతాడు. అపుడు పడవ నడిపేవాడు ‘‘అదేంటి బాబూ! ఆ ప్రశ్న ఇప్పుడడుగుతారు. పడవెక్కక ముందే అడగాల్సింది’’ అంటాడు. ఈ ప్రశ్నలో ఉద్యమం కూడా స్ఫురిస్తుంది. ఉద్యమంలోకి రాకముందే అన్నీ ఆలోచించుకోవాలని.
ఇంకొకచోట విప్లవ యోధుడు సత్యం దాహంతో బాధపడుతుంటాడు. కొండల్లో ఎక్కడా మంచి నీళ్లు కనిపించవు. అక్కడ ‘‘దూరం దూరంగా కొండసానువుల్లో పెద్ద పెద్ద జలాశయాలు, ఆశలు వురకలు వేశాయి. ముందుకు పరుగులు తీసింది. మరీచికలు ఆమెను ఆహ్వానిస్తూ ముందుకు అంతవేగంగానూ పరుగులు తీశాయి. ఎండమావులు కొండెక్కాయి. ప్రతిభ ఆగిపోయింది. మృగతృష్ణ తన ఆర్తిని తీర్చలేదు’’ అని గ్రహిస్తుంది.
ఉద్యమంపట్ల నవలా రచయిత్రి ఉద్దేశం కూడా అదే. సాయుధ పోరాటాలు, రక్తపాతం ఈ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టంగా, వ్యంగ్యంగా చెప్తుంది.
ఈ విప్లవోద్యమంలో మధ్యతరగతివారే పాల్గొంటున్నారు. అసలు బాధితులు దూరంగానే ఉంటారు. వారు సంఘటితం కానంతవరకు, చైతన్యవంతులు కానంతవరకు ఈ ఉద్యమం ఫలించదు. సామ్యవాద సమాజం రాదు అనే సత్యాన్ని స్పష్టంగా చెప్తుంది. మరీచిక పేరు సార్థకం చేస్తుంది.
ఈ నవలలోని స్ర్తి పాత్రలు సజీవ పాత్రలు. తాము కోరుకున్న జీవితం కోసం, తాము నమ్మిన సిద్ధాంతం కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేసినవారు, సంఘం చక్రాలలో ఇమడలేనివారు, సంఘం కొలబద్దల్ని తిరస్కరించినవారు, కృత్రిమ మర్యాదా తీరాలను లక్ష్మణరేఖల్ని అధిగమించినవారు.
పితృస్వామ్య వ్యవస్థను, దానిలోని లోటుపాట్లను సమర్థంగా చిత్రీకరించింది ఈ నవల. కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చిన జ్యోతిని కాబోయే భర్త ‘‘కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికెళ్లావ్’’ అని అధికారం చెలాయిస్తాడు. కూతుర్ని అర్థం చేసికొన్న తండ్రి కూడా కూతుర్ని అడగకుండా కూతురి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాడు.
ఈ నవలలోని శబరి, జ్యోతి పెళ్లి నిర్ణయించినాకే పెళ్లిని తిరస్కరించి ఇంటి బయటకు వచ్చేస్తారు. శబరి తల్లి, తండ్రి కూడా శబరికి ఇష్టం లేకపోయినా ఆదిత్యను చేసుకోమని బలవంతపెడతారు. వాళ్లిద్దరు కూడా ఇష్టం లేకపోయినా ఒకే ఇంట్లో మార్జాల దంపతుల్లా జీవించడం వివాహ వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిస్తుంది.మరీచిక చదివాక జ్యోతి కోరిన సమ సమాజం రావడానికి ఇంకా దూరం తరగనందుకు విచారిస్తాం. ఇరవై ఏళ్ల క్రింద పరిస్థితి ఇంకా ఇలాగే వున్నందుకు బాధపడతాం. ఇన్ని ఉద్యమాలు, పోరాటాలు దాడిచేసినా ఎరమింగిన కొండచిలువలా మత్తుగా పడివున్న సంఘం కళ్లెదుట కనబడుతూ పరిహసిస్తున్నపుడు, శాంతి, స్వేచ్ఛగా పరిమళించే నవ సమాజం, సమసమాజం ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నల గాయాలు మన గుండెల్ని సలుపుతూనే వుంటాయి. -సమాప్తం

-మందరపు హైమావతి