వినమరుగైన

ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ విచిత్రమేమంటే సిద్ధాంతం లాగా ప్రతి పాత్రలో కూడా అనేక అంశాలు వున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తారు.
ఉదాహరణకు రాంభూపాలరావు తానునిజాం పాలనకి సానుకూలుడైనప్పటికీ, హైదరాలీ వైపున జరిగినటువంటి మతాంతీకరణను వ్యతిరేకిస్తాడు. తనకు కుడిభుజంగా వున్నహైదరాలీ రైతుల్ని మోసగించటంలోనూ, అలాగేతనకి ఎంతో పట్టుగా వున్నప్పటికీ ఈ విషయంలో రాంభూపాలరావుకి నచ్చనివిషయాలున్నాయి.
పైగా అందుకు ప్రతిగా తను హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజీయుడైనటువంటి విజయదేవుని తీసుకురావటం ఆ విజయదేవుడు ఇస్లాం మతాంతీకరణకు ప్రతిగా హిందూ మతంలోకి మళ్లీ తిరిగి వారిని తీసుకురావటానికి ప్రయత్నించటం, ఇవన్నీ కూడా ఒక పార్శ్వం.
అలాగే ఇంకొక విషయమేమిటంటే, ఇందులో కొన్ని పాత్రలు సజీవంగా మనకు కనబడేటటువంటి అంశంగా ఉంది. ఉదాహరణకిఆండాళమ్మ వెంకటాచార్యుల ధోరణిని, కంఠీరవం ధోరణిని సమన్వయ పరచుకోలేక సతమతమవుతుంటుంది. అన్నిటికీ తనకర్మ ప్రారబ్దమనుకుంటుంది. అలాగేకంఠీరవాన్నిప్రజా జీవనంవైపు ఆర్పించినటువంటి కొమరయ్య అమ్మ అన్నమ్మ. ఆమెదొక విశిష్టమైనటువంటి పాత్ర.
కంఠీరవం పట్లసానుభూతి చూపుతూనే ఆయన సనాతన ధర్మపథం నుండి విడివడ్డందుకు బాధపడుతుంటుంది. ఇలా ఎనె్నన్నో పాత్రలు మనకి క్రమంగా వికాసం చెందుతూ అందులో కనిపిస్తాయి.
ఉదాహరణకిచివరిలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించినటువంటి పురుషోత్తమాచార్లు, వెంకటేశ్వరరావు- వీళ్లిద్దరూ కూడా వకీళ్లు. వారు నిజాం పాలనలో ఆ విద్యావిధానం నండి వచ్చిన ఆ పాలన యొక్క లోతుపాతులు తెలిసినవారు. వారు చివరికి శ్రమజీవుల ఉద్యమంతో మమేకమై వారితో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకోవటంతో ఈ నవల పరాకాష్టకు చేరుకుంటుంది.
ముఖ్యంగా ఆళ్వారుస్వామిగారిందులో ప్రయత్నించినటువంటి శిల్పమేమిటంటే? ఏ ఉద్యమమైనా ప్రారంభదశలో అది మనం ఆదర్శంగా చెబుతున్నట్టుగా వుండదు. అది క్రమంగా అనుభవం ద్వారా వివిధ వ్యక్తుల సమాహారమైనటువంటి ఆ కలయిక ద్వారా, సంఘర్షణ ద్వారా ఎలా ఆ ఇతివృత్తం రూపుదిద్దుకుంటుంది-ఆళ్వారుస్వామి గారు ఇందులో చక్కగా చూపించారు.
ముఖ్యంగా ఇందులో భూసమస్యకు కేంద్రంగా దానిని ఆలంబనచేసుకుని అనేక విషయాలొస్తాయి. ఉదాహరణకి ఎన్నడో వూరు విడిచి వెళ్లిపోయినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబ భూమిని తన భూమిగా చెప్పుకుని రాంభూపాలరావు కొన్ని ఏళ్లు దాన్ననుభవిస్తూ వచ్చాడు.
దానిని కౌలుకు చేస్తున్నటువంటి కొమరయ్యను బేదఖల్ చేసి ఆయనపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి, ఆ దొంగ సాక్ష్యం వెంకటచారితోను చెప్పించి తాను మేజిస్ట్రేట్ కోర్టులో తన పట్టా పొందుతాడు. ఈ విషయాన్ని చివరకువకీలు వెంకటేశ్వరరావలుగారి ద్వారా అలాగే గ్రంథాలయోద్యమంతోపాటు ఆంధ్ర మహాసభ కార్యకర్త అయినటువంటి పరంధామయ్య, అలాగే రాంభూపాలరావు యొక్క ఈ భూస్వామ్య అనుకూల, నిజాం అనుకూల వ్యతిరేకత నచ్చని విజయదేవ్ కూడా మారి వీరందరూ చివరికి అతని మోసాన్ని బయటపెట్టడం జరుగుతుంది.
ఆఖరికి రాంభూపాలరావు ఎక్కడైతే, ఏ వూళ్లో అయితే మకుటం లేని మహారాజుగా ఎదిడో అక్కడే అతనిని జైలుకు పంపించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది.
కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినందుకు రాంభూపాలరావుని, వెంకటాచారిని పోలీసలు తీసుకెళుతున్నదశలో ఈ నవల ముగుస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే తెంలగాణ రైతాంగ పోరాటం తరువాత ఉధృతరూపం దాల్చటానికి ముందు ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని అందులో వివిధ శక్తుల సమ్మేళనం ఎలా జరిగింది-
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సి.రాఘవాచారి