వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీ తరువాత ప్రయోగాలు చేస్తున్న కవుల్ని ‘నవ్యాధునికులు’గా శ్రీపాద గౌరవించారు. ఆ సత్కారాన్ని పొందినవాళ్లలో మల్లవరపు విశే్వశ్వరరావు, పిలకా గణపతిశాస్ర్తీ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ, సంపత్ రాఘవాచార్య, పఠాభి, కుందుర్తి, బాలగంగాధర తిలక్, గోపాల చక్రవర్తి, భద్ర సింహాసనాలు పొందారు.
వీరి కవితా ధారా ధోరణులను ఎగాదిగా చూసి చూపించారు. శ్రీపాద పద్యాన్నీ, వ్యాకరణాన్ని ఈ కవులు పూర్తిగా మన్నించలేదు. మాకు అడ్డుపడి అల్లరిపెట్టే వాటిని తన్ని తరిమివేయాలనిపించిందని చమత్కరించారు శ్రీపాద. కుందుర్తి తిలక్‌ల ద్వారా మాత్రాచ్ఛందస్సులు తోకముడిచే స్థితి వచ్చేసింది. వచన పద్యం రాణి అయింది. శక్తివంతంగా అందంగా చెప్పడం సాగకపోతేనే అలంకారం అని కూడా శ్రీపాద వచన కవితాశక్తికి వెనకేసుకొచ్చారు. అయితే అది గుణపక్ష పాతంవల్లనే! ఆయన ప్రశ్న వినండి ఏ నియమాలూ లేకుండా వ్రాస్తే కవిత్వమా? అని అడుగుతారేమో నియమాలన్నీ పాటించి వ్రాస్తే కవిత్వవౌతుందా?..
కవిత్వానికో నియమాలక్కరలేదు. ఆ సత్యం గ్రహించడానికి తెలుగు వారికిన్ని శతాబ్దలు పట్టింది అంటూ నిట్టూర్పు విడిచి వచనా పద్యాలు రాసేవారిని చూసి మూతి విరుచుకోనివ్వండి. వారి మూతులట్లే ఉండనివ్వండి అని చురకనంటించారు.
అనుభవాన్ని కరిగించిపోయడం ఆధునికతా లక్షణం. జీవిత సమస్యలనెదుర్కొనే ఎదిరింప శక్తినిచ్చే రచనలు నవ్యాధునికతా లక్షణం అని క్రోడీకరించారు శ్రీపాద.
1950-60 మధ్య కవిత్వాన్ని అంచనా వేయడానికి ఈనాటి సంరంభం అనే వ్యాసం రాశారు. అది ఈ సిరీస్‌లో చివరిది. 1964 జనవరి భారతిలో వచ్చిందిది. సంకెళ్లను తెంచిపారేసిన నవ్యాధునికుల కృషి ఫలితంగా పలు ముఖాల కవిత్వం మొదలయ్యిందన్నారు. నవ్యాధునికుల్లో రెండోతరం ఆధునిక ఆరుద్రగా వీరికి కనిపించడం సహజం. ఆరుద్రలో స్వేచ్ఛతోపాటు ప్రత్యేక తంత్రం కూడా ఉందని వీరు గమనించారు. ఊహలకు బదులు వస్తువునీ అనుభవాన్నీ వాడటం ఆ నిర్మాణతంత్రం. త్వమేవాహం శ్రీపాద పరిశీలనలో నిగ్గుతేరింది. భారతిలో వచ్చినా, అప్పటికి శ్రీరంగం నారాయణబాబు కవిత్వం గ్రంథరూపం ధరించలేదు. రుథిరజ్యోతిని ఆయన ఆరుద్ర వద్ద చూశారు. నారాయణబాబు బ్రహ్మముడులు శ్రీపాద విమర్శలో విడిపోయాయి.
పాఠకుల కోసం చక్కని అవగాహన కవాటం తీశారు. హాస్యాన్ని కవిత్వంలోకి తెచ్చిన జరుక్, మాచిరాజుల ధోరణుల్ని శ్రీపాద స్పృశించారు. ఈ వ్యాసంలో నాది ప్రజల ఉద్యమం అన్న గురజాడను కమ్యూనిస్టులెలా గుర్తించారో వివరించారు. సంఘంలోని దీనులపక్షం వహించి రచనలు చేయడం కొత్త సంరంభమయిందన్నారు.
‘ఈ సందేశాలు ప్రజలకందుతాయా?’ అని నిలదీశారు. ఎవరో చెబితే వినే రోజులు ఎప్పుడో పోయాయి! అయినా చెప్పేవారు చెబుతూనే ఉంటారు. చెప్పవలసిన అంశం వుంటే శక్తివంతంగా చెప్పండి అని ముగిస్తూ శ్రీపాద తెరలోంచి వెనక్కు వెళ్లిపోయారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సంపూర్ణం

మిరియాల రామకృష్ణ