వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీపాద వారి భాష గురించి ఎక్కువ చెప్పవలసిన పనిలేదు. అక్షరజ్ఞానం ఉండి సాహిత్య పరిచయం ఉన్నవారికెవరికైనా ఆ విషయం విదితమే. శ్రీపాద వారి వాడుక భాషా సౌందర్యం ఆస్వాదయోగ్యమే కాని దాన్ని గురించి ఎంత చెప్పినా చాలదు. ఒక అక్షరం.. పదం.. అది ప్రతిభావంతుడైన వాడి చేతిలో.. అక్షర శక్తి తెలిసినవాడి చేతిలో పడితే దానికి రంగు, రుచి, వాసన సంక్రమిస్తాయి. శ్రీపాదవారిది ప్రతిపద పరిమళభరితమైన భాష. అందాల సంవాద కథన ధోరణి, ఈ ఆత్మకథాత్మక రచనలోనూ ఆ సుందర లక్షణం సంపన్నంగా కనిపిస్తుంది. తన భాష కేవల పాండిత్య ఫలం కాదనీ, లేక గ్రంథ పఠనంవల్ల వచ్చింది కాదనీ ఆయన విచిత్రంగా చెప్పారు. తన భాష తన చుట్టూ ఆవరించుకుని వున్న జీవితం నుంచి, ముఖ్యంగా తన చుట్టూ వున్న సామాన్య అవిద్యావంతులైన గృహిణిల నుంచి తాను నేర్చుకున్నానని ఘంటాపదంగా చెప్పారు. ఈ గ్రంథంలో ఆయన అత్యంత వినయంగా తనకు వాడుక భాషలోని అందాన్నీ రమణీయకాన్నీ నేర్చిన గృహిణులకు పేరు పేరునా కృతజ్ఞత తెలియజేయడం మరింత అబ్బురపరిచే విషయం. పైగా తాను వ్రాస్తున్న భాష వారనుగ్రహించిన దాన్లో సహస్రాంశమైనా లేదు. ఇంతా చేస్తే అనడం మరీ విచిత్రమైన విషయం. తమ తల్లిగారు, తటవర్తి సుబ్బమ్మగారు, మైలవరపు జోగమ్మగారు, బుద్ధవరపు సీతమ్మగారు- ఈ పుణ్యస్ర్తిలందరూ ఏ లోకాలలో వున్నారో- దినదినమూ జరుపుకునే గోష్ఠి తనకు అత్యంత రుచ్యమైన వాడుక భాష నేర్పిందని శ్రీపాదవారి ఉవాచ. ఛలోక్తులు, శే్లషలు, సామెతలు, పలుకుబళ్లు, ఇంకా నవరసాలు ఆ సంభాషణలలో.. అక్కడ సరస్వతీదేవి లాస్యం చేస్తున్నట్టుండేదిట. ‘వారే కాదు, నలుగురు స్ర్తిలెక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ ఉండిపోయేవాణ్ణి’ అంటారు శ్రీపాద. ఇప్పుడు అర్థమవుతుంది మనకు ఆయనవ్రాసిన ‘యావజ్జీవం కోష్యామి’ కథలో పేరులేని ఆ కోమలాంగి సరసమైన మాటల ధోరణి ఎక్కడిదో.
ఈ గ్రంథం ఆనాటి సమాజంలోని వివిధ పోకడలకు ఒక నిలువుటద్దం. అప్పటి జన జీవితానికి అచ్చమైన ప్రతిబింబం. అప్పటి సామాన్య ప్రజల జీవనాడి. గుండెచప్పుడు. తాను అనేక సందర్భాలలో అనుభవించిన దారిద్య్రం..

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య