వీరాజీయం

‘నమో-షా’ల అనుబంధం ఉభయ తారకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిసి కెమెరాలు, రహస్య వీడియోలు.. ఇవి ఎందరో కొమ్ములు తిరిగిన రాజకీయ దురంధరుల్ని కూడా చిత్తు చేసాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా లాంటి చదరంగ దురంధరుడు కూడా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కంగుతిన్నాడు. తన గెలుపు.. అదే మొట్టమొదటి సారి ఎంపీ అయ్యానన్న ఆనందం, రాష్టప్రతి, ఉప రాష్టప్రతులుగా తాము అనుకున్న అభ్యర్థులను ఘనంగా గద్దెమీద కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా భాజపా కింగుమేకరు అమిత్భాయి అనిల్చంద్ర షాని ఉత్తేజ పరచలేకపోయాయి. నర నారాయణులుగా వాసికెక్కిన నరేంద్ర మోదీ, అమిత్ షాలకి- కాంగ్రెస్ వ్యూహకర్త అహ్మద్ పటేల్ గెలుపు ‘పఠేల్ పఠేల్’ మంటూ ప్రత్యర్ధి బాణ సంచా కాలుస్తున్నట్టు అనిపించింది. పైగా సత్యహరిశ్చంద్రుని చంపి పుట్టినట్టు ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేస్తాడా? షా ఎవరు? ఎన్నో పదవులు ‘నమో’ హయాంలో గుజరాత్‌లో చలాయించిన వాడు.. ఒక దశలో పనె్నండు పోర్ట్ఫులియోలు నిభాయించినవాడు-1997 నుంచి ఎన్నికలలో ఓటమి ఎరుగని వాడు-అట్టి అమిత్‌జీకి ప్రధాని చేత్తో తినిపించిన మిఠాయి కూడా చేదుగా అనిపించింది. పైగా, షా గుజరాత్ చదరంగ సంఘానికి, క్రికెట్ సంఘానికి కూడా లోగడ బాస్‌గా పనిచేసి ఎత్తుకు పైఎత్తులు వెయ్యడంలో,పొలిటికల్ గూగ్లీలు వెయ్యడంలో పండిపోయిన అనేక యుద్ధముల ‘ఆరిన’ కాదు ఆరియు తేరిన వాడు. వృద్ధమూర్తి కాదు.. యాభయి రెండో పుట్టినరోజు పోయిన అక్టోబర్లో ఘనంగా చేసుకున్న ‘గ్యాంబిట్ మాస్టరు’. వ్యూహ నిపుణుడు. తాను ఎవరినైతే ‘బెత్తాయించుకున్నాడో-ఆ భ్రష్టు (రెబల్) కాంగ్రెస్ సభ్యులే తొందరపడి అతనికి పబ్లిక్‌గా తోక ఊపి భాజపా బాస్‌కి తలవంపులు తెచ్చారు పాపం!
ఎన్నికల అధికారికి ఓ వీడియో అందింది. అది తెరువగా అసలు ‘తెర’ లేచింది. అమిత్ షా ఒక హాలులో ఠీవిగా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ఎదుట భోలాభాయి, గోవిల్ రాఘవభాయి పటేల్ అన్న నామాంకితులైన ఇద్దరు ‘గీత’ దాటిన కాంగ్రెస్ సభ్యులు అతి వినయంగా ఇలా ముందుకి వొంగి ‘తాము సారు చెప్పినట్టే గీత దాటి వోట్లు భాజపా అభ్యర్థికి గుద్దేశామ’ని ఘనకార్యం సాధించిన పోజులో వోటు పత్రాలని ప్రదర్శించారు. గోడలకి కాదు ఇలాంటి ఎన్నికల సమయంలో గాలిలో కూడా వేగుల- కెమెరాలు ఉంటాయి అని మనం చెప్పాలా? దీనే్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. రూల్సు తెలియని ఈ భాభ్రజమానులే-వ్రతం చెడి పైగా ఫలం దక్కకుండా చేసారు. అయితే, అహ్మద్ పటేల్ అదృష్టం అంత తేలికగా కలిసి రాలేదు. చాలా ప్రహసనం సాగింది. ఈలోగా చర్చలు, నిందలు, నిష్టూరాలు, సిగపట్ల గోత్రం అంతా అయింది.
కాంగ్రెస్ వాళ్లను ఎద్దేవా చేస్తూ ‘ఇదేదో 2019 ఎన్నికలలో ఘనవిజయం సాధించినట్టు పిచ్చెక్కి పోతారేం ? మీరు’ అన్నారు భాజపా భక్తులు. వెంటనే కాంగ్రెస్ అభిమానులు, అహ్మద్ పటేల్ అనునాయులు-మీరు మాత్రం రేపటి ఎన్నికలలో వోడి పోతామేమో అన్నట్టు గింజుకుంటారేంటి? అని దెప్పి పొడిచారు. పెద్ద రచ్చ, చర్చలు సాగాయి. ఇది అమిత్ షా, అహ్మద్ పటేల్ మధ్య 2010 నాటి ‘వెండెట్టా’ వ్యవహారం. ‘షో హ్రబుద్దీన్ హత్యకేసు’లో హోం శాఖా మంత్రిగా (మోడీ గుజరాత్ హయాంలో) వుండి కూడా అమిత్భాయి షా ఇరుక్కుని ఆనాటి జులై 25న అరెస్టు అయి జైలుకెళ్లవలసి వచ్చింది. అంతేనా.. బెయిలు దొరికినా, ‘గుజరాత్‌లో అడుగుపెట్టరాద’న్న ఆంక్ష సైతం పడ్డది. అదంతా ఓ పెద్ద గాథ-అప్రస్తుతమ్ ఇప్పుడు.. ఏమంటారు? కాని షాకి పగ తీరాలంటే అహ్మద్ పటేల్ ఓటమి కావాలి. దానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి కాని, పటేల్ గట్టెక్కేశాడు. ఐదోసారి రాజ్యసభకి ఎన్నికైనాడు. ఎన్నికల కమిషనర్ మొదట వీడియో చూడనన్నాడట. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పరిగెత్తింది. రూల్స్ ప్రకారం బ్యాలెట్టు పత్రం చూపించడం తప్పు. సదరు వోట్లు చెల్లవు అని కాంగ్రెస్ నాయకులు పి.సి.చిదంబరం, రణదీప్‌సింగ్, సురేజ్వాలా, అశోక్ గెహ్లాట్ మొరపెట్టుకున్నారు. భాజపా మాత్రం ఏమి తక్కువ తిన్నది? ఏకంగా అయిదుగురు మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ ప్రభృతులు ఈసీతో వాదించారు. చివరికి అరుణ్ జైట్లీ కూడా రంగంలోకి దిగాడు. కానీ, కాంగ్రెస్ నాయకుడు ఆనందశర్మ - ఒక ఉదాహరణ చెప్పాడు. హర్యానాలో ‘మా వాడొకడు పొరపాటున సిఎల్‌పి నాయకుడికి బ్యాలెట్ పేపర్ గొప్పగా చూపెడితే ఆవోటు చెల్లదు పొమ్మన్నారు మీరు’ అని దృష్టాంతం చూపగా-ఎన్నికల సంఘం ‘సరే ఆ వీడియో చూద్దాం అని చూసి, విస్తుబోయి ఆ రెండు వోట్లు బుట్టలో పడేసిందట. పైగా కాంగ్రెస్ నేత వాఘెలా మహాశయుడు కూడా తన వోటును పాపం.. అహ్మద్‌కి ఆశపెడుతునే ప్రత్యర్థికి పడేశాడు. ఇదండీ ‘పెద్దల సభ’కి జరిగిన ఎన్నికల తీరు...
మొత్తానికి సోనియాగాంధీ మాస్టర్‌మైండ్ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభలో అయిదోసారి అడుగుపెడుతున్నాడు. అతని చిరకాల శత్రువు అమిత్ షా మొదటి సారి రాజ్యసభలోకి అడుగు పెడుతున్నాడు. కాకపోతే ఈ సంఘటన- గుడ్డిలో మెల్ల-బిజెపికి చిన్న మనస్తాపం తప్ప-అభిమానుల మధ్య వాగ్యుద్ధం తప్ప ఇంకేమీ చెప్పుకోద్గది కాదు. కాకపోయినా అమిత్ షాకి వ్యిక్తిగతంగా మాత్రమే దెబ్బ. ఐతే ఈ గుజరాతీ గడుసు బేరగాడి సామర్ధ్యానికి మెప్పుదల ఏమీ తగ్గలేదు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూస్తే అమిత్భాయి అనిల్చంద్ర షాగా 1964 అక్టోబర్ 22న ముంబాయిలో సంపన్న వ్యాపారి అనిల్చంద్ర ఇంట- జైన్ బనియా కుటుంబంలో పుట్టాడు. కానీ, అహ్మదాబాదులోనే చదువుకుని మైక్రోబయాలజీలో డిగ్రీ తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆరెస్సెస్ శాఖలో చురుకుగా ఉంటూ ఎబివిపి నాయకుడిగా పెరిగి ప్రచారక్ అయినవాడే. నరేంద్ర మోదీకి అనుయాయుడే. 1986లో ‘కమలం’ పార్టీలో చేరాడు. కింద మెట్టునుంచి అంచెలంచెలుగా మోదీ కుడి భుజంగా అతని గుజరాత్ మంత్రివర్గంలో చేరి తిరుగులేని నాయకుడయ్యాడు. ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జిగా అనూహ్యమైన ఫలితాలను- 80 ఎంపీ సీట్లలో 73 సీట్లు గెలిచి మోదీకి అందించాడు. ‘మోదీజీ మీకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఘనవిజయాన్ని అందిస్తా’నన్నాడు. కాలికి బలపం కట్టుకుని కొన్ని లక్షలమైళ్లు జనాల మధ్య పర్యటనలు చేసాడు. హేమాహేమీలు ఉండగా పార్టీ పగ్గాలు నరేంద్రుడు తనకు ఇవ్వగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒకరకంగా బిహార్ (నితీష్‌ని తిరిగి లాగి)ను సంపాదించి పెట్టాడు.
మణిపూర్, జార్ఖండ్ ఇలా ఒక్కో కోటలో పాగా వేసుకుంటూ పోతున్న అమిత్షా ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్ చే తిలో గట్టిదెబ్బ తిన్నాడు. ఇటీవల పంజాబులోను చుక్కెదురు కాగా నిస్పృహ చెందక ముందుకి సాగుతున్న అమిత్ క్రెడిట్ ఏమిటంటే- ములాయం, మాయావతి లాంటి వారిని మరుగున పడేలాగా చేసాడు. భారతీయ జనతాపార్టీ అంటే బ్రాహ్మణ, బనియాల పార్టీ కేవలం మిడిల్ క్లాసుకే పరిమితం అన్న చెడుముద్రను తొలగించి పార్టీకి దళిత ప్రాతిపదికనీ కూడా తెచ్చిన అమిత్‌షా దక్షిణాది మీద దృష్టిపెట్టి అక్కడి అన్నాడిఎంకె పార్టీని దువ్వుతున్న ఈ దశలో కేంద్ర మంత్రిగా మారిపోతే పార్టీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందేమో నంటున్న ‘్థంక్ ట్యాంకు’ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ పెద్దలయిన కురువృద్దులను పక్కన పెట్టడంలో అమిత్‌షా కన్నా ‘నమో’కే ఎక్కువ బాధ్యత ఉన్నదని పార్టీ అనుయాయులు కొందరైనా గట్టిగా నమ్ముతున్నారు. మోదీ మాట అతనికి వేదవాక్కు అయినా, షాని కాదని మోదీ కూడా పశ్చిమ బెంగాల్ సహా వేరే రకం నిర్ణయాలు తీసుకోడని పార్టీవర్గాలు అంటున్నారు. అమిత్‌షా వ్యాపార దృష్టితోనే ఏ పని చేసినా చేస్తాడని అంటారు. కాని గాంధీ గారిని ‘చతుర బనియా’ అన్న అమిత్‌షాని ఒకవేళ మహాత్మా గాంధీ ఇవాళ ఉండివుంటే గొప్ప ‘చతుర బనియా’ అని కొనియాడి ఉండేవారు అన్నాడొక పాతకాలపు భాజపా కార్యకర్త. ఇవాళ, శివసేనని మహారాష్టల్రో ఏకు మేకు కాకుండా చేయగల చతురత ఒక షాకే వున్నదని ఎందరో అభిప్రాయపడుతున్నారు.
గ్రామస్థాయి నుంచి వ్యవస్థాపక మార్పులు రావాలన్న షా ముందుగా కోఆపరేటివ్ రంగాన్ని కైవసం చేసుకుని గుజరాత్‌లో జనప్రియుడైనాడు. ఆర్థికంగా పార్టీకి పునాదుల అవసరాన్ని గుర్తించిన అమిత్ షా- అయోధ్యలో రాముడినీ అటక ఎక్కించారంటారు. కానీ నమోని పార్టీని అందలం ఎక్కించడానికి -పార్టీకి సెక్యులర్ బేస్ రావడానికి షా చేసిన స్పీడ్ వర్క్‌ని పొలిటికల్ పండిట్స్ గుర్తించారు. పార్టీ అధ్యక్ష పదవిని వెంకయ్య నాయుడు లాంటివారు నిభాయించలేకపోయారు కాని కాషాయ జెండా రెపరెపలతో వికసించిన కమలం లాగ మోదీకి అతని ‘మొహ టా’తోనే అప్పగించిన క్రెడిట్‌ను పరిశీలకులు చాలావరకు అమిత్ షాకే ఇస్తారు. ఇవాళ, మొత్తంమీద పద్దెనిమిది రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యాన్ని విడిగానో, కలివిడిగానో సాధించిన ఘనత నమో-షాలకి చెందుతుంది. కాకపోతే అమిత్‌భాయి షా ఒక్కోసారి మోదీజీని జై హనుమాన్ లెవెల్లో ఆకాశానికి ఎత్తేస్తూ తానూ ఎదిగాడు. కొన్నిచోట్ల- ఉదాహరణకి ఇటీవల-అమిత్ భాయి తెలంగాణ పర్యటన బూమ్‌రాంగ్ అయ్యే స్థితికి రాగా నమో వెనుకనుంచి కమ్ముకొచ్చి పరిస్థితుల్ని సర్దుబాటు చేస్తూ వుంటాడు. ఈ ఇద్దరికీ, వింధ్యకి ఇవతలకి మార్గాలు సుగమం అయ్యేదాకా ఈ ‘చతుర వ్యాపారి’ని తనకు అంతరంగిక మంత్రిగానే తప్ప కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే తప్పిదం నమో నారాయణుడికి మంచిది కాదు అన్నాడో ‘కమలం’ పార్టీ భక్తుడు. ఇప్పుడు రాజ్యసభలో కూడా బలం వచ్చేసింది కనుక సంస్కరణలకే కొదువ ఉండదు. కాకపోతే కాశ్మీర్ లాంటి సమస్యల విషయంలో ఒక్క తప్పటడుగు వేసినా వెయ్యి అప్పడాలకి ఒకే సొడ్డు అన్నట్టు అయిపోతుంది. అది కత్తిమీద సాము.

అఫ్‌కోర్స్- నో ప్రాబ్లం ఏస్ లాంగ్ యాజ్ దే వర్క్ ఇన్ టేండమ్!
*

veeraji.columnist@gmail.com