వీరాజీయం

‘ఫ్రంటు’లోయమ్మ.. ‘ఫ్రంటులూ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ మనం ఈ ‘కాలమ్’లో కలుసుకునేది 2019లోనే. 2018కి ‘గుడ్ బై’ చెప్పేముందు- దేశంలో రాజకీయ చిత్రాన్ని ‘హోల్ మొత్తం’గా మార్చిపారేసి వెళ్లిపోతున్నందుకు ‘శభాష్ శెభాష్’లు చెప్పాలి కూడా. కొంతమంది మెటికలు విరిచి మరీ తిడతారనుకోండి- అది వేరే సంగతి.
రానున్న కాలం- 2019 అంతా ‘ఫ్రంట్’ల మయం. ‘‘ఫ్రంటులోయమ్మ .. ఫ్రంటులూ’’ అంటూ భళ్లున తెల్లారినట్లు కొత్త సూర్యోదయం కాబోతోంది. 2014లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ- ‘పీనిక్స్’లాగా లేచిందన్నాడొక ఇందిరాగాంధీ వీరాభిమాని. ఎప్పటిలాగే స్తబ్దుగా ప్రారంభమైన 2018వ సంవత్సరం మోదీ పర్జన్య గర్జనలతోనే కొంతకాలం సాగింది. కానీ, ‘కమలం పార్టీ’కి అపశ్రుతులు, అపశకునాలు ఎదురైనట్లుగానే సాగింది. కాంగ్రెస్, దానితోపాటు ఇతర ప్రతిపక్షాలూ, చాలావరకూ ప్రాంతీయ పార్టీలు మాత్రమే అయినా-గొంతు కలిపాయి. భాజపా ఖాతా నుంచి ఏడాది చివరకొచ్చేసరికి ఐదు రాష్ట్రాలు జారిపోయాయి.
దక్షిణాదిన కాలూని, జెండా పాతడానికి జాగా కోసం అఖిల భారతీయ జనతా పార్టీ వెతుక్కుంటోంది. తెలుగు రాష్ట్రాల దగ్గర కొచ్చేసరికి, కొత్త రాష్ట్రం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా తెనుగువాడు మోదీ పార్టీకి- అక్కడోరకంగా, యిక్కడో రకంగా ‘దేవిడీమన్నా’ విధించేశాడు. మహర్జాతకుడు- తెరాస అధినేత కేసీఆర్ అశ్వమేథ యాగం తర్వాత గుఱ్ఱాన్ని వదలిపెట్టినంత వీరోచితంగా జైత్రయాత్ర లాంటి ‘ఫ్రంట్ యాత్ర’ తీరం వెంబడే సాగించసాగాడు.
‘‘ఫ్రంట్.. ఫ్రంట్’’ అంటూ తెలుగు ముఖ్యమంత్రులు- విడివిడిగా దేశం మీద పడ్డారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన- దేశంలో గాంధీ కుటుంబ పాలన’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా వినబడే అరుపులు- చివరికి పిల్లికూతలైపోయాయి.
అంతేనండీ బాబూ! వోటర్‌లని ‘జనం’ అంటాం కదా మనం. వాళ్లు యిలాగే ‘ప్రభంజన’మై కేసీఆర్ కుటుంబ పాలనకి లైన్ క్లియర్ యివ్వడమే గాదు, ఎఱ్ఱ తివాచీలు పరిచారు. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి, యిరవై సంవత్సరాల తర్వాత సారథ్యం మారింది. సోనియా మాత తనయుడు రాహుల్‌కి పగ్గాలందించింది. జాగ్రత్తగా చూస్తే-మోదీజీ ఒకరకమైన బ్రహ్మచారైతే రాహుల్ గాంధీ మరొకరకమైన బ్రహ్మచారి. వాళ్లకి వాళ్లే వారసులుగా వాగ్యుద్ధం సాగించారు. మోదీజీకి ‘‘సబ్ కే సాథ్ సబ్‌కా వికాస్’’ అనడానికి వీలు లేకుండా సంఘ్ పరివార్‌లోనే ఎదురుగాలి వీచింది. తను చేసిన ఘనకార్యాలను ఏకరువు పెట్టకుండా-కేవలం రాహుల్ గాంధీ-రఫ్ఫేల్’ (రఫ్) ఆడించేసరికి-అసలు సంగతి మర్చిపోయి-‘‘అటాక్ రాహుల్- అటాక్ కాంగ్రెస్ వైఫల్యాలు’’ అంటూ, శ్రీమాన్ నరేంద్ర మోదీ తన పోరాటాన్ని ‘పప్పు’లో కాలు వేసిన రీతి ‘డైవర్ట్’ చేసుకుంటూ (పో)రావడంతో- ప్రాంతీయ పార్టల వత్తాసుతో -‘‘అయోధ్య రామా! కావరావా?’’ అన్నట్లు దిగాలు పడిపోయింది భాజపా.
2018 అర్ధరాత్రి ‘రింగ్ అవుట్’ అంటే ‘రింగ్ యిన్’ అన్నది కొత్త ఫ్రంట్‌లకో జేగంటలాగా మ్రోగింది. ‘‘ఫ్రంట్ లోయమ్మా! ఫ్రంట్‌లూ’’- అంటూ తెలుగువీరులు యిద్దరూ ‘‘నేను కింగ్‌మేకర్ని నేనంటే నేనే.. కింగ్ మేకర్ని’’ అంటూ దక్షిణాది తడాఖా చూపిస్తూ- ఉత్తరాది ‘చలి’ విరిగే లాగా చర్చలు, వ్యూహాలూ అంటూ రంగంలో దూకి బిజీ అయిపోయారు.
‘‘ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టడానికి’’ అన్నట్లు దక్షిణాది నుంచి ప్రాంతీయ పార్టీల దెబ్బ చెలరేగగా భాజపా ‘ఛత్రం’ నీడకు ఎవ్వడూ దూరనంటున్నాడు. పైగా, సంఘ్ పరివార్ ఒకటి, ‘ఆగమాగం’ చేసేస్తుందేమోనన్న భయం వొకటి పట్టుకుంది. అటు చూస్తే యూపీలో ఆదిత్యనాథ్ యోగి కాని యోగి -ఆంజనేయస్వామి ‘కులం’మీద, భాగ్యనగర్ పేరుమీద లెక్చర్‌లు కొడుతూ ‘జనరంజనం’ చేస్తూంటే-అమిత్ షానేమో ‘మోదీజీదే వచ్చేసారి ప్రధానమంత్రి పదవి’ అంటూ వాగ్ధాటి ప్రదర్శిస్తూ వుండగా-కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, 2019లో సంచలనం కాగల ఎన్నికల గాలులు వీస్తాయని పొలిటికల్ వాతావరణ పండిట్స్ జోస్యం చెబుతున్నారు-అస్తు-
దక్షిణాదిన కాంగ్రెస్, డి.ఎమ్.కె, టి.డి.పి వగైరాల కలయికతో ‘ఫ్రంటు’ లేదా ‘కూటమి’ తథ్యం అంటున్నారు. అలాగే యూపీలో ‘స.సా’, ‘బసపా’లు రాష్ట్రీయ లోక్‌దళ్‌ని కూడా పిలిచి జట్టు కడుతున్నాయి. బిహార్‌లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, రాష్ట్రీయ లోక్ సమతా లాంటి చిల్లర మల్లర పార్టీలూ చేతులు కలుపుతున్నాయి. యు.పిలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ- మాయావతీజీని ‘దువ్వడం’ యింకా మానలేదు. ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ కూడా రెండు రకాల ఫ్రంట్‌లూ -మొత్తం మీద భాజపా మీదనే యుద్ధం చేస్తాయిట!
ఐతే, ‘‘ఏ రాష్ట్రాలలోని పార్లమెంటు సీట్లు, ఆయా ఫ్రంట్‌లు రేపు భాజపా నుంచి లాక్కుంటే? లాక్కోగలిగితే’’- ఇవీ.. ఈ చలికాలంలో వేడి పుట్టించే చర్చలు.
తెలంగాణ ఏర్పడిన నాలుగున్నర ఏండ్లకే దేశ రాజకీయ పార్టీల్లో గొప్ప సంచలనం తీసుకురాగలిగింది. ‘‘కొడుకుకి రాష్ట్రంలో ‘పట్టం’గట్టి, తాను దేశ రాజకీయాలలో ‘చక్రం’ త్రిప్పుతానని కేసీఆర్ అంటే- ఇంకేమైనా అప్పీలుంటుందా?’’ అనడిగాడో సీనియర్ సిటిజిన్. ‘‘ఏది సవాలో, అదే జనాలు’’ అన్నాడు ఓ ‘గో.పి’ (గోడమీద పిల్లి).
క్రీడారంగంలో ‘సింధు’ బంగారు విజయం ఎంత సంచలనమో సినిమా రంగంలో దీపికా, ప్రియాంకా, సైనా వగైరా గ్లామర్ బొమ్మల వివాహాలు కూడా అంత సంచలనాత్మకం.
ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాల బుడతడు క్రికెట్ జట్టుకి వైస్ క్యాప్టెన్ కాగా, ఏమీ ‘కొంప మునగదు’ గానీ- కోహ్లీ జట్టుకి కేవలం కోహ్లీ రికార్డులకు మించి మరింకేమీ సాధించలేదు అన్న అపవాదు పోవాల్సి వుంది.
మళ్లీ ‘ధోనీ.. ధోనీ’ అన్న పేరుతో క్రికెట్ ప్రేక్షకుల కేకలు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల క్రికెట్ మైదానంలో ప్రతిధ్వనించడం చూస్తాం. అదే రుూ ఏడాది చివరి ‘కొసమెరుపు’ అనుకోండి.
అయ్యవారి లింగం గారేం చేస్తున్నారయ్యా? అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు- అని కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పన్నులను రోజుకో ‘యిన్ని’ అంటూ లెక్కపెట్టుకుంటూ తగ్గిస్తోంది. అట్టి తరి, ఏడాది చివర ఓ మంచి పని చేశారంటూ-
రింగ్ ఇన్ లవ్ అండ్ పీస్..! ఆమెన్..!
*

సెల్: 92900 99512