వీరాజీయం

సీఎంల యుగళగీతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇద్దరమొకటై చేయి కలిపితే అదురు.. బెదురేమున్నదీ.. కృష్ణా గోదావరీ జలాలతో తెలుగునేల తడిసిపోతే పంట పొలాలకు కొదవేమున్నదీ..’’ అంటూ మూసీ తీరం నుంచి కృష్ణా తీరం చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని పోచంపల్లి శాలువా కప్పి మరీ- హామీ యివ్వడంతో- అంతవరకూ నలభై రెండు డిగ్రీల ఎండలో కాలిపోతున్న బుల్లి తాడేపల్లి టౌన్ మీద - ఉరుములు, మేఘాలూ చెలరేగి, జల్లులు జలజలా కురిశాయ్..
ఉలవచారూ, గోంగూర పచ్చడీ వడ్డించారో లేదో తెలియదు గానీ- రుూ యిద్దరు ముఖ్యమంత్రులూ భోజనం ఆరగిస్తూనే- ఆంధ్రా సీఎం ఇంట్లోనే ఏకాంతంగా ఓ ముప్పావుగంట సేపు ముచ్చటించుకున్నారు. ఆనక యిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ‘ఏపీ’ కారులోనే- రోడ్డుకిరుపక్కలా తెలుగు జనాలు జయజయ ధ్వానాలు చేస్తూండగా- ఉండవల్లికి వెళ్లారు. అక్కడే కాబోలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వుంది. అక్కడికి అనుకునేరు పొరపాటున, రుూ యిద్దరూ వెళ్లింది- అక్కడికి కాదండోయ్! ఉండవల్లిలో ఈ అరివీర భయంకర ముఖ్యమంత్రుల జంటకి ఉమ్మడి గురువైన శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వాములవారు వచ్చి విడిది చేసి వున్నారు. తన తర్వాత పీఠాధిపతి కానున్న స్వామివారికి నామకరణం చేసి, కిరీట ధారణ చేయించడానికి- ఆయన తన మందీమార్బలం, బలగంతో కొలువుతీరగా- అందుకే, ‘‘ఆహ్వానం పొంది, వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ సీఎంను వెంట తీసుకుని- లేదా.. యిటునుంచి అటు ఏపీ సీఎం తెలంగాణ సీఎంను వెంట తీసుకుని పోగా- పక్కనే వున్న ఉండవల్లి గుహలలోని - అనంత పద్మనాభస్వామి ‘శయనాసనం’ కూడా కొంచెం కదిలిందని అన్నాడో వ్యాఖ్యాత.
మొన్నటిదాకా ఉద్యమం, ఆరాటం, పోరాటం-ఆనక విభజనానంతరం వైరం, వైషమ్యం, కీచులాటలు- కుమ్ములాటలుగా సాగిన దాయాదుల ‘‘జీవన వైభవ విరోధాభాస శోభ’’ ఒక్కసారిగా మారిపోయింది. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రేపు తప్పక వస్తానని’’, జగన్ హామీయిస్తూ- కేసీఆర్‌కు ‘కనకదుర్గమ్మ’వారి విగ్రహాన్ని చేతికందించాడు- జగన్ ది గ్రేట్!
తాను బహుమతిగా యిచ్చిన వజ్రాల ముక్కుపుడక వున్నదా? లేదా? అని, అంతకుముందే- కొండెక్కి సాక్షాత్తూ, అమ్మవారిని దర్శించి- ‘‘అమ్మయ్య! వుందిలే’’, అనుకుంటూ, మురిసిపోయిమరీ వచ్చాడు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
ఇక ఆశ్రమంలో చూడాలి రుూ ముఖ్యమంత్రుల జంట చేసిన సందడి. స్వరూపానందేంద్ర స్వాములవారు - ఇద్దర్నీ అక్కున చేర్చుకుంటూ- ‘‘మహారాజులు వీళ్లిద్దరూ’’, అన్నాడు. ‘‘జగన్ పట్ట్భాషేకం కోసం- నేనూ, నా పీఠం వాళ్లూ ఐదేళ్లు తపస్సు చేశాం’’ అన్నాడు. ‘‘జగన్‌మోహనుడే ముఖ్యమంత్రి’’అంటూ- ముందే మేము కరపత్రాలు కూడా వేశాం. తెలుసా?’’అన్నాడు బెజవాడ భానుసమాన ప్రకాశమానమైన ముఖంతో. రాత్రికి రాబోయే పౌర్ణమి వెనె్నల లాగా నవ్వులు వెదజల్లుతూ స్వాములవారు-
‘‘జగన్ నా ప్రాణం అయితే కేసీఆర్ ప్రాణంతో సమానం’’ అని కూడా అన్నారు. ‘‘ఈ ఇద్దరికోసం, తానూ, తన పీఠం తపస్సు కొనసాగిస్తాం’’ అన్న హామీకూడా యివ్వడంతో రుూ ఘట్టం గొప్పగా విరామం తీసుకుంది.
ఈ అపురూప సన్నివేశాన్ని జనాలు ముక్కున వేలేసుకుని చూస్తూండగా- కొందరు జనాలు బిగ్గరగానే యిలా అన్నారు- ‘‘ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు ఉమ్మడి గవర్నరు మాత్రమే వున్నాడు. కానీ ఇపుడు ఉమ్మడి పీఠాధిపతి సైతం యించక్కా అమిరినాడు.’’
అవతల హైదరాబాద్‌లోలో- భాజపా, కాంగ్రెస్ పార్టీలు - రుూ ‘‘ భారుూ... భారుూ, హారుూ హారుూ’’- రమణీయ దృశ్యాలు చూసి ‘‘ఉడుకుడుకు బూరి’’ అయిపోయారు. అది వేరే సంగతి. ఈ విధంగా యింతవరకూ- చూపుల్లో పిడిబాకులు- ‘టాకు’ల్లో (మాటలలో) మర ఫిరింగులు పేల్చుకుంటూ సాగిన దాయాదుల ‘వేరు కాపురం’ యికమీదట ‘‘పువ్వుల నదిలో నవ్వుల నావ’’గా సాగు.. ఐమీన్ కొనసాగుతుందని మముబొంట్లు అనుకుంటున్నారు.
సరే, అసలు విషయానికొద్దాం. ‘‘రెండుసార్లు మహాభారతాన్ని ఇట్నుంచటూ, అట్నించిటూ చదివినాడు కేసీఆర్ ’’ అని స్వరూపానందేంద్ర స్వాములవారు కితాబు యిచ్చాడు! అట్టితరి మనం ఆ కోణంలోంచి చూసినా కేసీఆర్ మేధావియే. కావాలని కోపం ధరించి- ‘ భాష’ ‘యాస’మార్చి- తిట్టుకవిత్వం అందుకుని, అదరగొట్టే చంద్రశేఖరుడు- ఎవర్నేనా మంచి చేసుకోవాలీ అంటే చాలు- ‘‘కుడి ఎడమల కుసుమ పరాగం...వొడిలో కృష్ణా, గోదావరీ అనురాగం’’ అంటూ పాటలు పాడి- అందర్నీ సమ్మోహితుల్ని చేయగల చతురుడు.. సరసుడు.
అవతల ‘ఆల్మట్టి’ డ్యామ్‌ని మరో అయిదు మీటర్లు ఎత్తు పెంచుతున్న తరుణంలో- కృష్ణాగోదావరీ జలాలను మనం ‘జమిలిగా’- భగీరథ కృషిచేసి- గరిష్టంగా వాడుకుని- ఉభయ ప్రాంతాల నేలల్ని ‘సుజలాం- సుఫలాం’ చేసుకోవాలి’’ అంటూ ‘లీడ్’ తీసుకున్న కేసీఆర్‌ని అభినందించడానికి - అతనంటే కిట్టనివాళ్లు కూడా ముందుకు రావాలి మరి!
‘‘అసలు జల వివాదాలపై తీర్పులకు ‘ట్రిబ్యునల్స్’ ఎందుకు? మనం-మనం- కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. లిటిగేషన్లకి ‘స్వస్తి’ పలుకుదాం’’ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి- తనంతట తానుగా బెజవాడ వెళ్లడం నెల తిరగకుండానే యిది రెండవసారి. పైగా, ‘‘బెజవాడ అంటే ఏందో... భలే ముచ్చట తెలంగాణ ‘దొర’కి. ప్రకాశం బేరేజీ మీద కారాపుకుని దిగి, అటూయిటూ తిరిగేసి, మజాగా ఫొటోలు దిగిండు’’, అన్నది- పెద్ద వినాయకుడి గుడకాడ ‘తంపటకాయలు’అమ్ముతున్న ముత్తయిదువ అయిన ఒక బామ్మగారు-
‘‘యాగాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, సాములోర్లు- మన కల్చర్‌లో భాగాలే. అలాగే కానివ్వండి’’ అన్నాడు బెజవాడ బడిపంతులు ఒకాయన. అసలు విషయం- ఈ ‘‘చేరుూ చేరుూ కలుపు- కొత్త మలుపు తిప్పు- అంటూ జరుగును అమరావతీ భూభాగంలో మరో చిత్రం! ‘చంద్ర’ పతనం కాదయ్యా.. అది ఎలాగూ అనుకున్నదే. అద్సరే. మన అసెంబ్లీలో నేషనల్ పార్టీ శాల్తీ ఒక్కడు లేడు- ‘అప్పో’లో ప్రాంతీయ పార్టీలు ‘సప్పో’ (ఏలిన వారి బలగం)లు కూడా ప్రాంతీయ పార్టీయే. ఇది మోదీ, అమిత్ షా, రాహుల్, సోనియాలు ‘కలత నిద్దుర’లో కూడా కలవరించాల్సిన సంగతి.
హోల్ మొత్తంగా అన్ని అంశాలు చాలానే వున్నాయిగా... అదే మరి- విభజనకు చెందిన తొమ్మిది మరియు పది షెడ్యూళ్లలో- 142 సంస్థల ఆస్తిపాస్తుల వివాదాంశాలున్నాయి. ‘‘నో ప్రాబ్లమ్’’అన్నీ ఉమ్మడిగా- బల్లకటూ యిటూ కూర్చుని- పరిష్కరించేస్తాం’’ అంటూ, రుూ తెలుగు ముఖ్యమంత్రులు హామీయిస్తున్నారు.
‘‘ఇదో గొప్ప ఉమ్మడి హోదా మనకి’’ అంటున్నాడు ‘తెనుగువాడు’. ‘‘కలిసి కేంద్రంతో పోరాడుదాం అన్న పిలుపుకి జగన్- ‘‘జయహో’’ కొడుతున్న రుూ దశలో వివరాలకి యిక్కడ ‘చోటు’ లేక, ‘శుభం’ పలికి వదిలేద్దాము జయహో!
టుగెదర్.. దే కుడ్ డూ బెటర్ థింగ్స్- ఇట్స్ ఏ ప్రామిస్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512