వీరాజీయం

పొట్టపొడిస్తే అక్షరమ్ముక్కుండొద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చదువురాని మొద్దూ... కదలలేని ఎద్దు’’- మళ్లీ మరోసారి అదే పాట- ‘‘చదువురాని మొద్దూ’’- కుర్రవాడు తన్మయంగా సూక్తులు వల్లెవేసేస్తున్నాడు బాలుడు. వాళ్లయ్యకి మండిపోయింది.
‘‘పెద్దోళ్లని తిట్టిపించడానికట్రా? రుూ సతుకులు... మీయమ్మని పిలూ’’- అంటూ అరిచాడు రైతుకూలీ రాజయ్య. కుర్రాడు పుస్తకంలోంచి తలెత్తలేదు. ‘‘విద్యలేనివాడు వింత పశువు’’- అంటూ అందుకున్నాడు మళ్లీ.
‘‘ఏమేవ్! యిట్రా... ఏందే, రుూడి వరస?’’అంటూ ఆ గ్రామ పంచాయితీ మెంబర్ అయిన పిల్లాడి- తల్లిని కేకేశాడు. ఈలోగా పిల్లవాడు కొనసాగించాడు. ‘‘విద్య లేనివాడు ద్విపాద పశువు’’- తండ్రికి మండింది. ‘‘ఏందిరా? ఇంకోపాలి ‘‘తిట్టం’’దుకున్నావ్? అమ్మనీ, అయ్యనీ తిట్టమనిరా పొంతుళ్లు నీకు పాటాలు సెపుతున్రు?’’- అసలా పోస్తకంలో మాటే అది. పిల్లవాడు చెప్పాడు వాళ్లమ్మకి. ఎందుకంటే, వాళ్లమ్మకి గ్రామ పాలనాధికారంలో భాగస్వామిగా, కుసింత ‘డొక్కశుద్ధి’ వున్నది.
‘ద్విపాద’అంటే ‘రెండు కాళ్ల’అని అర్థం అమ్మా!’’ ‘‘అదా!’’ అన్నది అమ్మ. అంటే మనిషికి చదువురాకపోతే ఆడు రెండుకాళ్ల పశువు అంటలే అయ్యా! మనల్ని కాదనుకునిపోతే పోలా?’’అంటూ లోనకి పోయిందా సర్పంచీయమ్మ.- వాళ్లమ్మకి కూడా ఎన్నికల్లో పోటీచేసినప్పుడు, పొట్టపొడుస్తే అక్షరంముక్క లేదుగానీ, తర్వాత ‘రాత్రి-బడి’లో చేరింది. ఎందుకంటే, అది ఆమే ప్రారంభించింది. సిగ్గుతో చచ్చిపోయి, ఐదుబళ్లూ ఒక్క రాత్రిలో దిద్దేసి నేర్చుకుంది. ఆనక సినిమా పోస్టర్లు చదివింది. ఈ దృశ్యం ఏనాడో అరవై ఏళ్ల క్రితంది కాదు. చాలా గ్రామాల్లో యిదే పరిస్థితి వుంది యిప్పటికీ.
ఎన్నికల్లో స్ర్తిలకీ, దళితులకీ- దేశ పాలనావ్యవస్థకి పునాది అయిన గ్రామ పంచాయితీలలో రిజర్వేషన్లు కల్పించారు గానీ, అక్కడ అర్హత వయస్సుదే. యోగ్యతలాంటి పెద్దపెద్ద మాటలకి చోటులేదు. కానీ యిటీవల హర్యాణా రాష్ట్రంలో - గవర్నమెంటు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే వయస్సూ రిజర్వేషనూ చాలదు- కనీసం అగ్ర కులాలకి అయితే పదో తరగతి దాకా వుండాలి.’ కాకపోతే ఆడాళ్లకి మాత్రం ఎనిమిదవ తరగతి వరకూ అయినా చదువుండాలి. దళిత అభ్యర్థులకయితే రుూ క్వాలిఫికేషన్ ఐదవ తరగతి మాత్రమేనని కూడా గవర్నమెంట్ అన్నది.
ఈ ఏడాది, రుూ చట్టం నిజంగా అమలుఅయితే హర్యాణాలో అక్టోబర్‌లోనే ఎన్నికలు అయిపోయి వుండేవి. మొత్తం డెబ్భయి రెండువేల మంది కొత్త పంచాయితీ సభ్యులు వివిధ హోదాలలో కొలువుదీరి వుండేవారు. కానీ, అక్కడి పరిస్థితులు అలాలేవు. ప్రస్తుతం వున్న పంచాయితీ సభ్యులలో డొక్కశుద్ధివున్నవాళ్లు అంతంత మాత్రం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ప్రస్తుతం వున్న మెంబర్లలో 32.2 శాతం నిరక్షర కుక్షులు- 38 శాతం పదిలోపు స్థాయిగలవారైతే 6.3 శాతం మంది మాత్రం ఇంటర్ మీడియట్ దాకా లాగించారు. తిరిగి ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే రుూసారి సగం మందికి అవకాశం పోతుంది.
దీంతో రగడ మొదలయింది. ఎమ్.ఎల్.ఏ.లకూ, ఎం.పీ.లకూ కూడా లేని కనీస విద్యార్హత- ఆఫ్టరాల్ గ్రామ ‘పంచ్’లకి వుండాలంటారా? మేధావులు వుంటారుగా సామాన్య జనం వెనుక- వాళ్లు‘లా’ పాయింట్ లేవదీశారు. కోర్టుకెక్కారు. రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 15 ప్రకారం అందరికీ, అంటే- అక్షరంముక్క వచ్చినవాడికీ, రాని వాడికీ కూడా పోటీచేసే అర్హత వున్నది’’- అన్నారు. హైకోర్టుదాకా కేసు వెళ్లింది. కోర్టువారు ఏ మూడ్‌లో వున్నారో, బాగా యోచించి, ‘‘బేసిక్- ఎడ్యుకేషన్’’ వుండాల్సిందేనంటూ తీర్పుచెప్పారు.
మండిపోయింది రాజకీయ నాయకులకి. సుప్రీంకోర్టుకి పరుగులు తీశారు. అంచేత, సుప్రీంకోర్టు తీర్పువచ్చేదాకా-నంటూ హర్యాణా పంచాయితీ ఎన్నికలు వాయిదాపడ్డాయి- అక్టోబర్‌లో....
దేశంలోని అత్యున్నత న్యాయస్థానంవారు- పోయినవారం ఎన్నికలలో తీర్పు చెప్పారు- ఐమీన్ పంచాయితీ ఎన్నికలలో పోటీచెయ్యాలీ అంటే కనీస విద్యార్హత వుండాల్సిందే. కాలం మారింది కనుక కొత్త పరిస్థితుల్లో నిరక్షర కుక్షులు పరిపాలనా వ్యవస్థని కొనసాగించలేరు’’- అంటూ బల్లగుద్ది- ‘ఆర్డర్...ఆర్డర్’ అంటూ ఆర్డర్ వేశారు.
అదండీ సంగతి! రాజకీయ పార్టీలకీ అక్షరం ముక్కరాని నిశానీదారులను అడ్డంపెట్టుకుని అధికారాన్ని నడిపిస్తున్న పెద్దలకీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. మోదీగారు- ‘‘బేటీ పఢావో... బేటీ బచావో’’- అంటున్నాడు గానీ దేశంలో ఎన్నికలలో పోటీచేసే ‘బేటా’కి కూడా - ‘ఓ’కి ఎన్ని వంకరలో తెలియాలి కదా? సామాన్యుడు గ్రహించాలి కదా? ఈ మాట!
సుప్రీంకోర్టు వారన్నట్లు గ్రామగ్రామాలకూ ఆధునిక విద్యావిధానాలు- అంతా కంప్యూటర్ల మయం అవుతున్నాయి. ఆన్‌లైన్‌గా డిజిటల్‌గా సాగిపోతోందీ లోకం. గ్రామగ్రామానికీ వై.ఫై. గాలిలో పెంకి దెయ్యాల గుంపులాగా సాగుతోందీ... దానివల్ల వచ్చే లాభాలకి మాత్రం విద్యా నైపుణ్యం అవసరం తప్పదు. కాదూ అంటే జనాలు ‘‘అతి విపరీత దుర్మార్గ దుష్ట సెక్సు వైపరీత్య దారుణ ఘోర వెబ్‌సైట్లు’’చూసుకుంటూ ‘‘సెల్ఫీలు’’ తీసుకుంటూ - ‘‘తాబేదారు’’ బ్రతుక్కి అలవాటుపడి పోతారు. బివేర్!
పోతే పోనివ్వండి. కొంతమంది ఐనా క్వాలిఫికేషన్ తెచ్చుకుని పాలనలోకి వస్తారు. అంతేగానీ మనుమలు, ముని మనుమలు ‘ర్యాట్’, ‘మ్యాట్’ అంటూ కంప్యూటర్ మాయ ను చూపెడుతూంటే వెర్రి మొహాలేసుకుని చూసే పంచాయితీ పాలకులు మనకేల? వద్దుగాక వద్దు!
ఆఫ్ ఆల్ ది రిఫార్మ్‌స్ ఎడ్యుకేషన్ రుూజ్‌ద బెస్ట్!