వీరాజీయం

ఎన్టీఆర్ పేరు హైజాక్.. కృష్ణమ్మ మీద భక్తి ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలంలో పాదయాత్రలు సంకల్పబలం ఉన్న వాళ్ళే చే య్యగల్రు. అందరూ చెయ్యలేరు. సంకల్పయాత్రలో అద్భతమైన సంకల్పమ్స్ అందరికీ రావు. మోదీ మహాశయుడు - కాంగ్రెస్సు రహిత భారత దేశం గురించి కలలు కనడం -అందుకు ఎన్నో చిట్కాలు, పథకాలు తయారు చేసుకోడం చూసి గొప్ప నాయకులు అదే బాట తామున్నూ అనుసరించడంలో నామోషీ లేదు. కానీ.. . ‘నమో’ ఒక గొప్ప థింకర్ - మేధావి అని కమూ నిస్టులు, కమ్మూనలిస్టులు కూడా ఒప్పుకుంటారు. కాకపోతే మోదీజీ సంకల్ప్ యాత్రలన్నీ - ‘ఇమానం’ మీదనే సాగుతాయి. మోదీజీ గగన రథాన్ని భూమార్గం పట్టించగల శక్తి ఒక్క తనకే ఉందని మన చంద్రన్న అను నారా చంద్రబాబు నాయుడి నమ్మకం. అందుకే ఆయన ధర్మ పోరాటాన్ని తిరుమల కొండ మీద నిలబడి మొదలు పెట్టాడు. బై దిబై -మన జగనన్న అను వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ఒక సంకల్పంతో ముందుకి సాగుతున్నాడు.
ముల్లుని ముల్లుతోనే తియ్యాలంటే- మొదట ఓ కాంగ్రెస్సు నాయకుణ్ణి - అఖిలభారత ఖ్యాతి గలవాడు అయన ఒక పెద్ద నాయకుడిని హైజాక్ చెయ్యాలి. ఇది మోదీ సంకల్పం. నమో అందరూ చూస్తుండగానే, కాంగ్రెస్స్ పార్టీకి ఓ జెల్ల కొట్టి మరీ ఓ బలమైన నాయకుడిని ఎత్తుకు పోయాడు. ఆ మహానాయకునికి - దూరం నుంచి ఆఖరికి అటు చైనా నుంచి కూడా కనబడే అంత పెద్ద ఆకాశ విగ్రహ నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. ఆ నాయకుడే సర్దార్ పటేల్. కాంగ్రెస్ వారు ఏ పేరు చెప్పి కాయలు అమ్ముకున్తున్నారో ఆ చెట్టుని పారిజాతాపహరణం లాగా చేసిన ఘనత ఎవరిది? ముమ్మాటికీ నమోదే. సర్దార్ పటేల్ ఉక్కుమనిషి. అలాగే గాంధీజీ గుజరాతీ వాడు కనుక - ఆయన మీద తనది జన్మహక్కు అని -ఓ ఐడియా వర్కౌట్ చేసి -ఆయన చేతిలో ఓ చీపురుపెట్టి -ఆనక - ఆయన ధరించిన ఆయుధం- రాట్నం చక్రాన్ని కూడా ఎత్తుకుపోయి కేలండరు మీద పెట్టుకుని స్వచ్ఛ భారత్ అంటూ ఇంటింటా ప్రవేశించాడు మోదీజీ.
అటువంటి బ్రిలియంట్ ఐడియాలు మన జగనన్నకి కూడా వస్తున్నాయని - ఇప్పుడు రుజువైంది అన్నాడో వైకాపా వీరాభిమాని. ప్రత్యర్ధిని -అతని వేలితోనే తన కన్ను పొడుచుకునేలా చెయ్యాలి .. అది కుట్ర కాదు -కుటిలము కాదు.. కౌటిల్యం అంటారు దాన్ని. పాదయాత్రలో ఒక ఐడియా వచ్చింది జగన్మోహన రెడ్డి సాబ్‌కి. సింహం గుహలోకి వెళ్లి - అక్కడనుంచి ప్రత్యర్ధి నాయకుడికి ఓ ‘షాక్’ ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. నిలబడ్డది నిమ్మకూరులో- అదీ.. నారా లోకేష్ పెంపకానికి తీసుకున్న కమ్మని గడ్డ మీద -‘‘జగన్ మోహన్ రెడ్డి సాబ్’’ - జన సమ్మోహనంగా - ఎర్రటి ఎండలోనూ- చల్లగా నవవుతూ -కృష్ణ జిల్లాకి నందమూరి తారక రామారావు పేరు పెడతానని ప్రకటించాడు. ఇది వైస్సార్ పార్టీకి ఏవిధంగా లాభమో ఎవ్వరూ చేప్పలెక పోయారు. కాని, టిడిపి వర్గాలకి వారి అధినాయకుడికి కూడా- అరికాలి మంట నెత్తికి ఎక్కి పో యింది. ఇది- విశ్వామిత్రుడి తపో భంగానికి మేనకని తోలడమేనని కొందరు ధర్మదీక్షలో ఉన్న చంద్రన్న వేపు గ్రహణం పట్టిన సూర్యుడి వేపు చూసినట్లు చూశారని కొందరి పుల్ల విరుపు మాట. జగనన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాగ్బానాన్ని సంధిచే సరికి -అస్మదీయులు,తస్మదీయులు కూడా - ‘ఏం దెబ్బ తీశావు?’ అన్నట్లు అవాక్కై చూశారు.. పటేల్‌ను అలనాడు కాంగ్రెస్సు ‘నెగ్లెక్ట్’ చేసినట్లు -ఇవాళ చంద్రబాబు పార్టీ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీయార్‌ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్న ‘్ధ్వని’- ఇరు వర్గాల శిబిరం లోను ప్రతిధ్వనించింది. కాకపోతే, ‘‘ఇఫ్’’ అన్న మాట ప్రక్కనే వున్నది.
జగనన్న మాటలు ఈటెలుగా మారిపోయాయి. సెంటిమెంటు మీద దేబ్బతీయలేదండీ మరి? - అని అడిగాడు టీవీ ‘చానల్స్‌లో’ ఊకదంపుడు చర్చలకి అలవాటు పడిన - ఉమ్మడి రాజధాని ప్రేక్షక మహాశయుడు ఒకడు. ఎన్టీఆర్ కి భారతరత్న తక్షణం ఇవ్వమని జగన్ అడగవచ్చుగా? తెలుగు వారికి ఆత్మగౌరవ భిక్ష పెట్టిన నటరత్న కి ఎంతటి రత్నఖచిత బిరుదు ఇచ్చినా చాలదు- అని జనం కబుర్లు చెప్పు కుంటున్న తరుణం లో - క్రిష్ణా బ్యారేజీ మీద ఉన్న కృష్ణ వేణి మాత బొమ్మ కొంచెం.. చిన్నబుచ్చుకుంది .. దేశంలో తెలుగు దేశం లో మాత్రమే కాదు ఇండియా -ద ట్ ఈజ్ భారత్ లో నే, మూడవ అతి గొప్ప పెద్ద నదీ రాజంగా విలసిల్లి - చరిత్రనీ భూగోళాన్ని పునీతం చేస్తూ ఉన్న నది మాట ఏమిటి? -అన్నాడట ఒక సామాన్యుడు. నీకూ, నీ జిల్లాకి వారంట దారంట ఒద్దికగా ఒరుసుకుంటూ పారుతూ జనాలకి అమృత ప్రాయమైన ‘వరి బియ్యపు కూడు’ యుగయుగాలుగా పెడుతున్న అమ్మని - ‘హర్ట్ ‘చేసి - మన ‘అన్న పేరు’ పెడి తే - లేదా పెడతానంటే ?- ఒక వేల అన్న ఎన్టీఆర్ మన మధ్య భౌతికంగా ఉన్నా హర్షిస్తాడా?
1904 వరకూ నేటి కృష్ణ జిల్లాకి ఆ పేరు లేదుట. ఒరిజినల్‌గా ఇది ఏర్పడ్డప్పుడు -మచిలీపట్టణం జిల్లా అనే పేరు ఉండేది. 1859 నాటి గాధ అది . బ్రిటిషు వారు రేవు పట్టణాలు వెతుక్కుంటు వచ్చి... మన దేశాన్ని కబ్జా చేసుకున్నారు.. వారికి మన బందరు ముఖ్యనగరం- వారు మద్రాసుని ముఖ్య నగరంగా చేసుకొనే వరకు. అది స్థల పురాణం. కొంత కాలం క్రితం విజయవాడకి ముఖ్య నగరం హోదా కావాలంటే - తూర్పు కృష్ణ - పశ్చిమ కృష్ణ గా జిల్లాని ముక్కలు చేసి - ఓ జిల్లాకి కృష్ణా తీరాన కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్ కట్టాలి అన్న ఉద్యమం లేచింది- విభజనలో -ఒక వేళ సముద్రం వేపు నాసి పొలాలు, నది వేపు నాణ్యమయిన పొలాలు వస్తే? సమతుల్యత దెబ్బ తిని పోదా? అంటూ కొందరు భోజన ప్రియులు అభ్యంతరం లెవ దీశారు కూడా.
కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు కావాలని అడగటానికి ముందు- తారకరాముని రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి కూడా - చెన్నైలోని ఎన్టీఆర్ ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దాలని పూనుకోలేదేమి? నందమూరికి విజయవాడలోనే ఘన చిహ్నం కావాలంటే ప్రత్యామ్నాయాలు ..ఒకసారి చూడండి - కొండ మీద కొండ లేదు కాని - మన బెజవాడలో కూడా ఏడు కొండలున్నాయి- ఒకటి గాంధీ గారికి అంకితం చేశాం. మరొకటి అమ్మ- గ్రామదేవత దుర్గమ్మ కొలువై ఉండగా -్భసిస్తున్నది. మరొక కొండ మేరీ మాత గుడిని పోషిస్తున్నది. మరో కొండపై వినాయకుడు, సత్యనారాయణుడు కొలువై ఉన్నారు. ఒక కొండని ఎంచుకుని -నందమూరి తారక రాముని పేరెట్టి అధ్యయన కేంద్రం, స్మారక భవనం - మ్యుజియం కూడా కట్టవచ్చును. ఎంతసేపూ.. పొలిటికల్ ‘యావ’, పరస్పర స్పర్ధ తప్ప -ఈ వోట్ల వ్యామోహాసురులకు - ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నదా? ‘‘మేము అడుగుతా ఉన్నామ’’ ని ఎందరో వీరాభిమానులు బాధ పడి పోతున్నారు. చక్కగా ఉన్న వాటిని విచ్ఛిన్నం చెయ్యడం, పేరు మార్చి చేతులు దులుపుకోడం తప్ప - ఏమి చేస్తున్నారు ‘బ్రదర్’. (ఎన్టీఆర్ ‘బ్రదర్’ అనే కదూ అందరినీ అప్యాయంగా సంబోధించేవాడు.)-అని జనం అడుగు తున్నారు. చెప్పరాదా.. జవాబు.
డోంట్ యూ ‘పొలిటిసైజ్’ హిస్ నేమ్.. బ్రదర్!

--వీరాజియం.... 92900 99512