వీరాజీయం

బంద్ చేసిన మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం మర్నాడే సెలవు కలిసొచ్చేలా సోమవారం నాడు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది ప్రతిపక్షం. కాంగ్రెస్ ప్లస్ మరో యిరవై ఒక్క పార్టీలు కలిసి బంద్ నాడు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ ఏలుబడిలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలున్నాయి గనుక? ఐతేనేం- రుూ బంద్ యిబ్బందులు వాళ్లకి గట్టిగానే తాకాయి. కాంగ్రెసేతర రాష్ట్రాలలో పనిలోపనిగా సైలెంట్‌గా అధికార ఉత్తర్వుల బలంతో పోలీసులు కాంగ్రెస్ మరియు తాత్కాలిక మిత్రపక్షాల బృందాలను కీళ్లూకాళ్లూ విరిగేలాగ బాదేశారు.
బంద్ సంపూర్ణం అన్నారు. బంద్ చేస్తూ సుఖానవున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నవాళ్లు ఉన్నారు. సంపూర్ణం అంటే పూర్తి గుండు సున్నా అన్నాడు ఓ భాజపా నాయకుడు. కానీ రుూసారి బంద్ పాటించింది ఉల్లిపాయల ధరల మీద కాదు. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఝామ్మని- పెట్రోలు డబ్బామీద అగ్గిపుల్లగీసి పడేస్తే మండినట్లు పెరిగిపోడం మీద -
కాబట్టి సోమవారం ప్రొద్దున్న పెట్రోల్ బంకులు బందైపోతే- ఓరోజు పెట్రోలు ఆదా-అంటూ కొంతమంది ‘మండే’ మార్నింగ్‌ని ఎత్తేశారు. సన్‌డే మార్నింగ్‌ని కొనసాగించారు. హైదరాబాద్‌లో మాత్రం సోమవారం తెల్లారుతూండగానే- గచ్చిబౌలి క్రాస్‌రోడ్స్‌లో భయంకరమైన రీతిలో టి.ఆర్.టి.సి. బస్ యమాస్పీడులో వచ్చింది. రోడ్డు క్రాస్ చేస్తున్న ముగ్గుర్ని మట్టేసింది. మృతుల్లో యిద్దరు ఆటోవాలాలు, మూడోవాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
‘హైదరాబాధ’ అని అంటూంటారు రోడ్లమీద ప్రయాణం తప్పనిసరిగా చేస్తూన్న వాహన చోదకులు. హైవేలు, గల్లీలు కూడా గోతుల మయం. యమపురికి అడ్డదార్లు అన్నట్లుగా ‘సాగుతున్నాయి’. కానీ వాటి మీద ట్రాఫిక్ మాత్రం ఎంత మాత్రమూ సాగదు. బంద్‌నాడు అన్నిరకాల శకటాలూ రెస్ట్ తీసుకుంటే బెటర్ అనుకున్నారు.
ఐతే జంటనగరాలకో శాపం వుంది (ట).. సోమవారం నాడే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, బస్‌లు, కారుల్లాంటి శకటాల ‘్ఢఢి’క్కులు ఎక్కువగా వుంటాయి అని పోలీసువారి అంచనా. అదే బుధవారం నాడు అయితే ఏక్సిడెంట్లు తక్కువంట. ఈ సంప్రదాయం (అనొచ్చా, రుూమాట?) ప్రకారం సోమవారం కూడా ఘోర ప్రమాదం- అదీ ఆర్.టి.సి. బస్సు ద్వారానే జరగటం- విధి బలీయం అనే అనుకోవాలి.
ప్రగతికి రథాలు, వాటికి చక్రాలూ అవీ పెట్టి కవులు గానం చేస్తూ వుంటారు గానీ- లారీల, బస్సుల, మోటారుకార్ల, ఆటోబండ్ల చక్రాలు వగైరాలే ప్రగతిని దొర్లించే సాధనాలు. పెట్రోలు లేదా డీజిల్ వుంటేనే గానీ యివి ‘పదండి ముందుకు అన్నా.. పదండి వెనక్కి..’ అన్నా కదలవు. త్రోసుకుంటూ పోవాలి. అందుకే హైదరాబాదు రోడ్ల మీద దారులు వెతుక్కుంటూ, ధైర్యంగా ‘‘చక్రధారు’’లు ముందుకు త్రోసుకుంటూ పోతారు.
ఏలినవారు గగన మార్గాలు, ఆకాశదారులూ వగైరాలను ముందు ముందు గొప్పగా నిర్మిస్తాం అని- పుండుమీద కారం జల్లినట్లు- కమ్మని కె.టి.ఆర్. మార్కు కబుర్లు వినిపిస్తూ వుంటారు. ప్రస్తుతానికి మాత్రం సోమవారం నాడు బంద్ సందర్భంగా పెట్రోలు ఆదా అనుకుని నెమ్మది పడ్డారు జనం. పెట్రోలు బంకులు బంద్ చేయిస్తే చాలు ఓ వారం రోజులు- దాంతో బంద్ దానంతటదే జయప్రదం అవుతుంది అంటున్నాడో ఆకతాయి.
కానీ, రుూ బంద్‌కి సపోర్టు యివ్వడం- మోదీగారికి, ముఖ్యంగా అమిత్‌షా గారికి- ‘గుస్సా’ తెప్పించడం కాగలదు. కనుక కొన్ని పక్షాలు మన టి.ఆర్.ఎస్ సహా గమ్మున వున్నారు. కాకపోతే కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో యాంటీ భాజపా, యాంటీ కాంగ్రెస్ పార్టీ అయిన తెదేపా గద్దెమీద కూకున్నప్పటికీ- పెట్రో బంద్ ఝామ్మని సాగింది.
చంద్రబాబునాయుడు రుూమధ్య పెట్రోలు లాంటి మండే పదార్థాల సహాయం లేకుండానే- నిప్పులు చెరగటం, మంటలు క్రక్కడం లాంటి ‘‘గ్రేట్స్‌ఫీట్స్’’యెన్నో చేస్తున్నారు. ఆయన సంధించే ఆగ్నేయాస్త్రాలన్నీ నిన్నటి మొన్నటి తన ఘన మిత్రుడయిన శ్రీమాన్ మోదీ మీదే! ఈ బంద్ నాయుడు గారి ఆవేశానికీ, ఆవేదనకీ ఆగ్రహానికీ అన్నింటికీ ఉత్ప్రేరకం అయిపోయింది. అర్జెంట్‌గా కేంద్రం ‘ఎక్సైజ్’పన్నూ, ‘సెస్సూ’ వగైరా తగ్గించి తీరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గద్దించినట్లు ప్రసంగిస్తూంటే సభ్యులు బల్లలుగుద్ది- ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్షాలు అన్నీ యివాళ రోడ్డున పడ్డాయి. ‘‘అయినా మీకు చీమకుట్టినట్లయినా లేదా?’’అన్నాడాయన. అమిత్‌షాని అడగాలి. ‘‘రేపటి ఎన్నికల రథానికి ఆయనే కృష్ణుడు’’కదా? అన్నాడో కమ్యూనిస్టు.
ఎంతయినా అమరావతి బెజవాడ సరసన వున్నది. అక్కడ మిరపకాయలకీ, జనాల మాటలకీ ‘‘రెడ్ కలర్’’తగ్గలేదు. కానీ, రుూసారి బంద్ ఆంధ్రులకి తక్షణం ఓ చిన్న ‘‘మేలు’’చేసింది. చంద్రన్న- మోదీ, షాల నిర్వాకాన్ని దెప్పిపొడుస్తూ, తక్షణం రాష్ట్రంలో పెట్రోలు లీటరు- ధర, డీజిల్ లీటరు ధర, ఒక్కసారి రెండేసి రూపాయల లెక్కన తగ్గించేశాడు. ‘‘వ్యాట్!’’ అంటున్నారా? అవునండీ అవును. ‘వాట్’ భారాన్ని యింధన చమురుల మీద తగ్గించేసి, తెల్లారేపాటికి రెండేసి రూపాయలు చక్రధారులకి ఆదాచేసే లాగ ఉత్తర్వులు వేశాడు నారా వారు. ఇది అంత తేలికయిన నిర్ణయం కాదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకి, పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం హరించుకుపోతుంది- ‘‘బాబోయ్! నాయుడు గారు తెలుగు తమ్ముళ్ల అభివృద్ధి కార్యక్రమాలకు యింత మొత్తం ఒక్కసారిగా బొక్కసం నుంచి లాగేసి ‘కన్నం’పెడుతున్నారేమో? అని ఎవరు అరవాలి? కాని కాంగ్రెస్ పార్టీ నోరు విప్పలేదు. ‘‘పెట్రోలు ధరలు తగ్గించాలి- బై హూక్క్ ఆర్ క్రూక్-’’ అని గదా స్లోగన్లు ప్రేలాయి? అంచాత, ‘‘అప్పులో అప్పు అర్ధశేరు ఇంగువ’’అన్నట్లు, రుూ చంద్రన్న చర్యని హర్షించవల్సిందే- కాంగ్రెస్ మాత్రం కిమ్మన లేదు...
పనిలోపనిగా రుూమధ్య, బాగా అలవాటయిందిగా, మళ్లీ ఆం.ప్ర. ముఖ్యమంత్రి బాబుగారు మోదీ గవర్నమెంట్ మీద పెట్రోలు పొయ్యికుండా మంటలు క్రక్కాడు. పెట్రోలు, డీజిల్స్‌పై ఎక్సైజు పన్ను- డివిడెంట్ల రూపాలో నాలుగేండ్లలో యిరవై మూడు లక్షలకుపైగా వసూలుచేశారన్న సంగతి- ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి గుర్తుచేశారు. ఏమయింది యిదంతా? దానిమీద అర్జెంటుగా నమోజీ ఇకనైనా జీవో ‘‘తెల్లకాగితం’’విడుదల చెయ్యాల్సిందేనన్నారు నాయుడుగారు- ఆహాహా!.. శే్వత పత్రం లాగే వుంది ఎకానమీ దేశంలో యిప్పుడు. రేపు పొద్దున్న చమురు ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటాయి. అప్పుడేం? చేస్తారు? ఏవో సాకులు చెబుతున్నారు కేంద్రం వారు. అంతర్జాతీయంగా పెట్రోలియమ్ ధరలకు రెక్కలొస్తున్నాయి. రాష్ట్రాలేమో ‘వ్యాట్’ పెంచేస్తున్నాయి. అంచేత పెట్రోలు, డీజిలు యిలా మండిపోతున్నాయి’ -అని జనాల్ని మభ్యపెడుతున్నారు- ‘కేంద్ర ప్రభుత్వం’వారు. కానీ వారు విధించే ‘సెస్సు’లే, రుూ కష్టాలకు కారణం. రహదారులకు వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అంటూ లీటర్ పెట్రోలు మీద 7 రూ, డీజిల్ మీద 8 రూ. పన్ను వేశారు ‘ఇదెక్కడి న్యాయం?’ అంటూ నాయుడుగారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రశ్నించాడు. ‘‘ప్రత్యేక హోదా యిస్తే యిటువంటి అనుమానాలు రాకపోను నారా వారికి’’- అంటూ విసుక్కున్నాడు ఓ భాజపా నాయకుడు. ఒక సామాన్యుడు బెజవాడ గవర్నర్‌పేట పెట్రోలు బంకుదగ్గర నిలబడి ‘అమ్మచేస్తేనేం? అయ్యచేస్తేనేం?’ రాష్ట్రంలో లీటర్‌కి రెండ్రూపాయలు చమురు ధర తగ్గింది అంతే! - ‘‘చలో’ నా కీలుగుర్రానికి ఎక్స్‌ట్రా రెక్కలు వచ్చినట్లే కదూ?’’అంటూ ఆయిల్ కొట్టించుకుని జాలీగా బెంజి సర్కిల్ వైపు దూసుకుపోయాడు. అన్నట్లు, అవతల రాజస్థాన్‌లో భాజపా ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా గౌరవ్ యాత్ర చేస్తూ, రుూ బంద్‌కు చలించిపోయింది. జనాల్లో అసలే ‘వీక్’గా వున్నదామె పొజిషన్. అమిత్‌షాగారు రుూ వసుంధరా రాజే మీద రాజీ లేని ‘గుర్రు’చూపిస్తున్నాడు కనుక రుూ బంద్‌ను అదనుగా తీసుకుని ప్రజలకో ‘వ్యాట్’ తగ్గింపు వరం ప్రసాదించింది. పబ్లిక్ మీటింగ్‌లో... ‘నాలుగు శాతం వ్యాట్’లో కట్ చేస్తున్నానని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నాయకుల నోరు కట్టేసింది. మొత్తం మీద ‘చక్రధారులు’ అక్కడా, యిక్కడా కూడా లీటర్‌కి రెండు రూపాయలు చొప్పున నొక్కేశారన్నమాట!-

బ్రావో.. వాట్ ఏ స్ట్రోక్..? ‘వ్యాట్’ కట్.!