విశాఖ

పోలీసులను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవుటర్ల, సెప్టెంబర్ 21: ప్రజల రక్షణ కోసం 24 గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీసులను అందరూ గౌరవించాలని రాష్ట్ర వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు అన్నారు. శుక్రవారం ఆయన కోటవురట్లలో విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల గౌరవం దెబ్బతీసే విధంగా జెసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఇందుకు తగినట్లుగా అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం స్పందించడం పట్ల దత్తుడు సీతబాబు ప్రశంసించారు. శాంతి భద్రతలు అదుపులో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసులను అగౌరవ పరిచేలా ఎవరు వ్యహరించినా సమంజసం కాదన్నారు. జెసీ వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలన్నారు. ప్రజల ధన,మాన ప్రాణాలను కాపాడడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. ఏ పార్టీకి చెందిన నాయకులైనా పోలీసుల పట్ల గౌరవ భావంతో ఉండాలని సీతబాబు తెలిపారు.
వినాయకుని ఉత్సవాల్లో అన్న సమారాధన
మాకవరపాలెం, సెప్టెంబర్ 21: మండల కేంద్రమైన మాకవరపాలెం బీసీ కాలనీలో శుక్రవారం ఉదయం భక్తులకు కమిటీ సభ్యులు అన్న సమారాధన నిర్వహించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా కాలనీలో గొల్డెన్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేసారు. నవరాత్రుల్లో భాగంగా యూత్ సభ్యులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసారు. దీనికి స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా హాజరై ప్రసాదం స్వీకరించారు. ఈకార్యక్రమంలో పీ ఎ సీ ఎస్ లాలం లక్ష్మణ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఆర్ సర్వేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.