విజయవాడ

నంద్యాల ప్రజలను మోసగిస్తున్న టిడిపి, వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: నంద్యాల ప్రజలను అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. నంద్యాల అసెంబ్లీకి జరుగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన రెడ్డిని నిర్ణయించినట్లు చంద్రబాబు, జగన్మోహన రెడ్డిలు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో శిల్పా మోహన రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన భూమా నాగిరెడ్డి గెలుపొందారు. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక వస్తే భూమా నాగిరెడ్డి కుమారుడైన బ్రహ్మానంద రెడ్డిని తెలుగుదేశం పార్టీ వారు నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన రెడ్డిని ఇప్పుడు వైఎస్సార్ సిపి అభ్యర్థిగా జగన్ ప్రకటించారన్నారు. ఇంత నిస్సిగ్గుగా రాజకీయం చేయడమనేది ఈ రెండు పార్టీలకే చెల్లిందన్నారు.