కృష్ణ

బాబుపై అమర్యాదగా మాట్లాడితే గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూన్ 3: ప్రపంచ దేశాలలోనే మేధావిగా రాజకీయ దురంధురుడిగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి శవాన్ని పక్కన బెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన జగన్ ప్రతిపక్ష నేత కావడం దురుదృష్టకరమని అన్నారు. రాజకీయ అనుభవంలో, వయస్సులో పెద్దవాడైన చంద్రబాబుపై జగన్ అసభ్య పదజాలం ఉపయోగించడం ఆయన నైజాన్ని తెలుపుతుందని, జగన్ భాష, వైఖరి నచ్చకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్వచ్చందంగా తెదేపాలో చేరుతుంటే అసహనంతో జగన్ ఏ మాట్లాడాలో తెలియక వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. స్థానిక నేతలు నయవంచన అంటున్నారని, ఎవరిది నయ వంచనో ప్రజలకు తెలుసునన్నారు. ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సింది పోయి బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కొఠారు సత్యనారాయణ ప్రసాద్, ప్లోర్ లీడల్ యలమంచిలి రాఘవ, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు మొండితోక జాన్‌కోటయ్య, డిసి చైర్మన్ ఏసుబాబు, తిరుపతిరావు, గుండ్ల కృష్ణారావు, కౌన్సిలర్‌లు ఆరేపల్లి సౌరి, కటికల అనిల్ పాల్గొన్నారు.