కృష్ణ

జిల్లాలో వెయ్యి యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: జిల్లాలో యువత సామాజిక కార్యక్రమాల్లో చు రుకుగా పాల్గొనేందుకు వెయ్యి యూ త్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం యువజన సంక్షేమ శా ఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం యూత్‌క్లబ్‌ల ఏర్పాటుపై యువజన సంక్షేమాధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. ఈసందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ 10మంది గ్రూపు సభ్యులుగా వెయ్యి యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో పం చాయతీకి ఒక్కో యూత్‌క్లబ్, మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకటి చొప్పున ఏ ర్పాటు చేయ్యాలన్నారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిలో ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులుగా 10వ తరగతి, సాధారణ సభ్యులుగా 7వ తరగతి ఉత్తీర్ణులైన వారిని నియమించవచ్చని తెలిపారు. సభ్యులు గ్రా మాల్లో సామాజిక, సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, 18 ఏళ్లు వయస్సు నిండినవారిని ఓటరుగా నమోదు చేయించటం, బాల కార్మికుల ను గుర్తించి వృత్తి మాన్పించడం, డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాల ల్లో చేర్పించడం, సామాజిక దురాచారాలైన వరకట్నం, అత్యాచారాలు, స్ర్తిలు, పిల్లలు, దివ్యాంగులపై జరుగుతున్న హింస నివారణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆరోగ్యంపై చైతన్యపర్చడం, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలపై అవగాహన, హెచ్‌ఐవీ, ఎయిడ్స్, కలరా, మలేరియా, వ్యాధుల పట్ల అవగాహన క ల్పించటం, సేంద్రీయ వ్యవసాయాన్ని ్ర ం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యువజన సంక్షే మ శాఖ అధికారులు యూత్ క్లబ్ స భ్యులను గుర్తిస్తారని, ప్రభుత్వ సంక్షే మ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహ న, సమాచారాన్ని అందించడంలో వా రు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. గ్రామీణ క్రీడలైన కబాడీ, కోకో, షటిల్, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, యోగా వంటివాటితో శారీరక దృఢత్వా న్ని పెంపొందించేలా గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించడం వంటి వాటిని సభ్యులు ప్రధానంగా చేపట్టేలా యూత్‌క్లబ్‌లు పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు.

వీఎంసీ అభ్యున్నతికి సహకరించండి
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 23: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వీఎంసీ అభ్యున్నతికి ప్రభుత్వం సహకరించాలని స్పెషల్ సెక్రటరీ టు సీఎం సతీష్ చంద్రను మేయర్ కోనేరు శ్రీ్ధర్ కోరారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ వీఎంసీకి చెందిన వివిధ అంశాలు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ ఉద్యోగుల మాదిరిగా వీఎంసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతాలను చెల్లించే 010 జీవోను అమలుచేయాలన్నారు. వీఎంసీకి జమయ్యే ఆదాయంలో అత్యధిక శాతం ఉద్యోగుల జీతాల చెల్లింపులకే సరిపోతోందని, దీంతో నగరాభివృద్ధికి నిధుల కొరత ఉత్పన్నమవుతోందన్నారు. అలాగే వీఎంసీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మితమవుతున్న 11 అంతస్తుల భవనం నిర్మాణ విషయంలో సానుకూలంగా స్పందించి తగు అనుమతులను మంజూరు చేయాలన్నారు. పరిపాలనా పరంగా ఎదురవుతున్న కార్యాలయ వసతి సమస్యల పరిష్కారానికి నూతన భవన నిర్మాణం తప్పనిసరి అని వివరించారు. అలాగే ప్రభుత్వ పరంగా వీఎంసీకి జమ కావాల్సిన వివిధ నిధుల విడుదల, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ పోస్టులకు అర్హులను నియమించాలన్న అంశంతోపాటు పలు విషయాలను సతీష్ చంద్రకు దృష్టికి తీసుకురాగా, ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించినట్టు మేయర్ తెలిపారు.