విజయవాడ

మా సొంతింటి కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు సారథ్యంలో శాఖాధితుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించిన సిబ్బంది శనివారం ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నందుకు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ల సిబ్బందికి 010 ద్వారా ట్రెజరీ జీతాలు ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి తాము అడిగిన వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఉద్యోగులు అందరూ బాబు చేసిన మేలుని జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్ మాట్లాడుతూ ఈరోజు బాబు జారీ చేసిన జీవో నెం.81 ద్వారా ఉద్యోగం చేసినంత కాలం తమకు నెలవారీ జీతాలు అందుతాయనే భరోసా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ టీవీ ఫణి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు, సిటీ జేఏసీ అమరావతి చైర్మన్ కూనాటి కళాధర్, ఏపీ ఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అంజి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.