విజయవాడ

ముగిసిన టీచర్ల బ్యాడ్మింటన్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 17: ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభు త్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న 46వ కేబీఎస్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కళాశాలల లెక్చరర్ల బ్యాడ్‌మింటన్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్-2 బాబురావు పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జానయ్య, కార్యదర్శి చిగురుపాటి యుగంధర్, వేణుగోపాల్, వివిధ కళాశాలల వ్యాయామ విద్యాసంచాలకు లు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, తదితరులు పాల్గొన్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో చిన్నికృష్ణ, జెస్సీల జోడీ ప్రథమస్థానం, విశ్వనాథ్, భానుప్రకాష్‌ల జోడీ ద్వితీయస్థానం, సీహెచ్ బాలజీ, రాజబాబుల జోడి తృ తీయస్థానం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో అరుణ సుజాత, వనజాల జోడీ ప్రథమస్థానం, రాధిక, అపర్ణల జోడీ ద్వితీయ, కార్తీకపావని, వెంకటరమణల జోడి తృతీయస్థానం దక్కించుకున్నారు. మిక్సిడ్ డబుల్స్ వి భాగంలో రాధిక, వాసుదేవరావులజోడి ప్రథమ, కెవిఎస్ శిరీష, బి నందకుమార్‌ల జోడి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. వెటరన్ డబుల్స్‌లో కె సుబ్బారావు, రమేష్‌ల జోడి ప్రథమ, డి కృష్ణప్రసాద్, గోపాలకృష్ణల జోడి ద్వితీయ స్థానం సాధించగా సూపర్ వెటరన్ డబుల్స్‌లో జి సాంబశివరావు, కె లక్ష్మీనారాయణల జోడి ప్రథమ, బి కృష్ణమూర్తి, పీవీ కృష్ణారావుల జోడీ ద్వితీయస్థానం కైవసం చేసుకున్నారు.