విజయవాడ

టీడీపీ ప్రచార రథాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 20: మొగల్రాజుపురంలోని తన నివాసం వద్ద నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా ఎన్నికల ప్రచార రధాలను జెండా ఊపి ప్రారంభించారు. 42వ డివిజన్ శ్రీకృష్ణదేవరాయులు విగ్రహం వద్ద నుంచి బొండా సిద్ధార్థ సైకిల్ యాత్ర జరిగింది. గాంధీనగర్‌లో మీదుగా ఈ యాత్ర కొనసాగింది. ఈసందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లు కనపడని వైసీపీ నేతల మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బొండా ఉమాని గెలిపించాలని కోరారు.
55వ డివిజన్‌లో..
స్థానిక 55వ డివిజన్ సింగ్‌నగర్‌లో మహిళా కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు మేలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రెండుసార్లు రుణమాఫీ చేశారని, అలాగే మెప్మా ద్వారా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా అందచేయడం జరిగిందన్నారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని, వచ్చే ఎన్నికల్లో మహిళలు మళ్లీ తెలుగుదేశాన్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పిరియా జగదంబ, డివిజన్ ఇంఛార్జ్ దాసరి కనకారావు, అధ్యక్షులు జాగర్లమూడి శ్రీను, గొట్టుముక్కల రఘు, నవనీతం సాంబశివరావు, అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.