విజయవాడ

అట్టహాసంగా గద్దె నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 20: విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ బుధవారం అట్టహాసంగా వీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా పటమటలంక నుండి ప్రారంభమైన గద్దె నామినేషన్ పాదయాత్ర పటమటలంక, రామలింగేశ్వరనగర్ వంతెన మీదుగా స్కూృబ్రిడ్జి, కృష్ణలంక మీదుగా వియంసీ కార్యాలయానికి చేరుకుని అనంతరం వీఎంసీ కార్యాలయంలో గద్దె దంపతులు, తదితరులు తూర్పు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాశ్‌రావుకు నామినేషన్ పత్రాలు అందచేశారు. దాదాపు గంటపాటు కోలహలంగా కొనసాగిన పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి గనె్న ప్రసాద్ ప్రచార రథంపై ఉండగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జై గద్దె, జై జై గద్దె, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ దాఖలకు ముందు తొలుత అశోక్‌నగర్‌లోని గద్దె నివాసంలో తన సతీమణి గద్దె అనూరాధతో కలసి గోమాతకు పూజలు చేయగా, ముస్లిం, క్రిష్టియన్ మత పెద్దలు, పూజారులు సర్వమత ప్రార్థనలు నిర్వహించి మీళ్లీ మీరే రావాలి అంటూ ఆశీర్వదించారు. పాదయాత్రలో గద్దె తనయులు రాజేష్, క్రాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ విద్యావంతుడేకాక, పేదల పట్ల ప్రేమగల వ్యక్తి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె చేసిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ తూర్పు నియోజకవర్గాన్ని తన శక్తి మేరకు అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కాట్రగడ్ట బాబు, రత్నం రమేష్, డివిజన్ టీడీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.