విజయవాడ

బస్టాప్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూలై 16: సింగ్‌నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గరికిపాటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం షిర్డీ సాయిబాబా బస్టాప్‌ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుపౌర్ణమి సందర్భంగా షిర్డీసాయి పేరిట ఏర్పాటు చేసిన ఈ బస్టాప్‌ను ప్రజలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు అప్పిరెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉమ్మడి వెంకట్రావ్, అలంపూర్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
* కిక్కిరిసిన సాయిబాబా ఆలయాలు
పాయకాపురం, జులై 16: గురుపౌర్ణమి సందర్భంగా నగరంలోని సాయిబాబా ఆలయాలు మంగళవారం భక్తులతో కిక్కిరిసి దర్శనమిచ్చాయి. సాయి ఆశీస్సుల కోసం భక్తజనం ఉదయం నుండే ఆలయాలకు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో నిర్వాహకులు భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ముఖ్యంగా ముత్యాలంపాడు, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్, పైపుల రోడ్డు, రాధానగర్, సత్యనారాయణపురం, తదితర ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలను రాత్రి నుండే విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి బాబాను దర్శించుకొని పూజలు చేశారు. కాగా గురుపౌర్ణమి నాడే చంద్రగ్రహణం కూడా రావటం ఈ సంవత్సరం విశేషమని భక్తులు అంటున్నారు.