విజయవాడ

ఆలయాల అభివృద్ధికి అండదండలందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 10: రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధి కి దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన పూర్తి అండదండలు అందిస్తామని ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వన్‌టౌన్ బ్రాహ్మణవీధి లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వా మి దేవస్థానంలో రూ.12లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉ దయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి అవసరమైన నిధుల ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చే పడుతున్నామన్నారు. తొలుత మంత్రికి ఆలయ అర్చకులు, కార్య నిర్వహణాధికారి గెల్లి హరిగోపీనాథ్‌బాబు స్వాగ తం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులకు క్వార్టర్స్ నిర్మాణానికి ప్లాన్ తయారు చేయమని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కమిషనర్ వీ సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు జీ శ్రీనివాసు, నాగేంద్రకుమార్, పీ సతీష్, ఆర్యవైశ్య సంఘ అర్బన్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, తదితరులు పాల్గొన్నారు.