విజయవాడ

నగరాలకు బీసీలుగా త్వరలో జీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లోని నగరాల కులాన్ని బీసీలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సముఖంగా ఉన్నారని, త్వరలో దీనిపై జీవో విడుదల అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరాల సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం కేంద్ర కార్యాలయ భవనం రెండో అంతస్తును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జ్యోతి వెలిగించి శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ నగరాలు అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని తాను స్వయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చానని చెప్పారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో దీనిపై జీవో కూడా ఇస్తారని ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణాజిల్లాలో ఉన్న నగరాలు కులస్తులను బీసీలో చేర్చి సామాజిక న్యాయం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నగరాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరస్వామి మాట్లాడుతూ నగరాలను మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌గా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ, బీమిలిలో రెండు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని కోరారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరాలు సంఘం అధ్యక్షుడు బాయన వెంకటరావు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, పోతిన బేసీ కంఠేశ్వరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన రామారావు, దోనేపూడి శంకర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, పణుకు శేషు తదితరులు పాల్గొన్నారు.