విజయవాడ

గవర్నర్‌ను కలిసిన కృష్ణా వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 23: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఎం కృష్ణారెడ్డి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ విశ్వవిద్యాలయ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు వాయిదా పడిన స్నాతకోత్సవాలన్నింటినీ పూర్తి చేయాలని వర్సిటీ అధికారులను కోరినట్లు ఉపకులపతి ఆచార్య కేబీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రగతికి తమ వంతు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.