విజయవాడ

సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో రైతుల సమస్య సామరస్యంగా పరిష్కరించుకుందామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గురువారం తనను కలిసిన వివిధ పార్టీల నాయకులు, రైతులకు సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం అసైన్డ్‌దారులు కలెక్టర్‌ను కలవగా ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ డా కే మాధవీలత, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్రతో కలిసి రైతులు, ఆయా పార్టీల నాయకులతో కలెక్టర్ మాట్లాడారు. పేదల ఇళ్లస్థలాల కోసం భూములు తీసుకునే సమయంలో సంబంధితులత చర్చించి సామరస్యమైన నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీపీఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి డీవీ కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోట కళ్యాణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.