విశాఖ

అన్నీ ఉన్నా..సిబ్బంది లేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో టెర్మినల్ ప్రారంభమైనా, పూర్తి స్థాయిలో అది పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎయిర్ కార్గో టెర్మినల్‌ను అట్టహాసంగా ప్రారంభించినా, ఇందులో పనిచేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బందిని మాత్రం ప్రభుత్వం కేటాయించకపోవడం గమనార్హం. విశాఖ నుంచి ఎయిర్ కార్గో రవాణా చేసే బాధ్యతను జిఎస్‌ఇసి సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి ఏడాదికి 40 వేల టన్నుల కార్గోను రవాణా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఆక్వా ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే, విమానాశ్రయంలో డ్రగ్ కంట్రోలర్ అనుమతి తప్పనిసరి. అయితే, ఇక్కడ డ్రగ్ కంట్రోలర్‌ని ఇప్పటి వరకూ నియమించలేదు. సీ ఫుడ్స్‌ను ఎగుమతి చేయాలంటే, యానిమల్ క్వారంటైన్ ఆఫీసర్ అనుతి తప్పనిసరి. ఆ అధికారిని కూడా నియమించలేదు. కాగా, కార్గోటెర్మినల్ భద్రతకు 175 మంది భద్రతా సిబ్బంది అవసరం ఉంది. కానీ, ఇక్కడున్నది 135 మంది మాత్రమే. మరో 40 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది కావాలని ఎయిర్‌పోర్టు డైరక్టర్ లేఖ రాసినా, ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సంవత్సరానికి 70 వేల టన్నుల కార్గో ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్ జిడిపిలో ఏనిమిదవ స్థానంలో ఉంది. జిడిపిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న విశాఖ నుంచి కార్గో ఉత్పత్తులు పెంచడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోలేకపోతోంది. విశాఖ నుంచి ఆక్వా, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తులు దుబాయ్ మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అటువంటిది విశాఖ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం శోచనీయం. అలాగే విశాఖ నుంచి వివిధ దేశాలకు కేవలం కార్గోను మాత్రమే రవాణా చేసే డెడికేటెడ్ కార్గో ఫ్లైట్ అవసరం ఎంతైనా ఉంది. ఇవేవీ లేకుండా విశాఖ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించినా ప్రయోజనం ఏముంటుంది?