విశాఖ

విశాఖ-జగ్దల్‌పూర్ స్పెషల్ ట్రైన్ కిరండల్ వరకూ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖపట్నం-జగ్దల్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను కిరండల్ వరకూ పొడిగించారు. జగ్దల్‌పూర్‌కు ఇది మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలుగా వాల్తేరు డివిజన్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం-కిరండల్-విశాఖపట్నం ప్యాసింజర్ మాత్రమే నడుస్తోంది. ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకూ కిరండల్ వరకూ నడవనున్న ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిరండల్‌లో ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దేరి, మర్నాడు తెల్లవారుజాము మూడు గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అలాగే విశాఖలో ప్రతి రోజు రాత్రి 10.15 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 10 గంటలకు కిరండల్ చేరుకుంటుంది.