విశాఖపట్నం

పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా పర్యవేక్షణ అధారిటీ కేంద్ర కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ హరిబాబు లేఖ రాశారు. పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన నేపథ్యంలో పనుల పర్యవేక్షణ కార్యాలయం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరంలో ఎయిర్‌పోర్టుతో పాటు అన్ని ప్రాంతాలను అనుసంధానించే విధంగా రైల్వే లైను ఉందని, పట్టణానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పోలవరం పర్యవేక్షణ అథారిటీ రాజమహేంద్రవరంలో అందుబాటులో ఉంటే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు.