విశాఖపట్నం

వైసీపీ దీక్షా ప్రాంగణాన్ని శుద్ధి చేసిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా తెలుగు ప్రజల నయవంచనకు పాల్పడిన వైసీపీ వంచన వ్యతిరేక దీక్ష చేపట్టడం దారుణమని టీడీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అరోపించారు. మహిళా కళాశాల ఎదురుగా వైసీపీ సోమవారం నిర్వహించిన దీక్షా శిబిర ప్రాంగణాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించని వైసీపీ నేతలు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ధర్మపోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం ద్వారా తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై, టీడీపీని విమర్శిస్తున్న జగన్, వైసీపీ నేతలు రాష్ట్రంలో అశాంతికి ఆజ్యం పోస్తున్నారన్నారు. అక్రమార్జన కేసుల్లో మొదటి ఇద్దరు ముద్దాయిలు జగన్, విజయసాయిరెడ్డి దొంగ దీక్షలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర అభ్యున్నతికి వెంకన్న సాక్షిగా ధర్మపోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. చంద్రబాబుకు అండగా ఏడుకొండల వెంకన్న ఉన్నాడని, కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి మేలు చేకూర్చే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. వైసీపీ దీక్ష చేసిన ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, పంచామృతాలు, గోపంచితముతో శుద్ధి చేసి, సంప్రోక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.