విశాఖపట్నం

6న దుర్గమాంబ అమ్మవారి జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, మే 1: శాంతినగర్ కైలాసపురం రోడ్‌లో వెలసిన శ్రీ దుర్గామాంబ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 6న జరుగుతుందని ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 16 గ్రామాల ఇలవేలుపు దుర్గమాంబ అమ్మవారికి జాతర సందర్భంగా ఆరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ వివిధ కార్యక్రమాలు జరుగుతాయని, సాయంత్రం 6 గంటలకు ఘటాల ఊరేగింపు, రాత్రి 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల అనంతరం 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసమారాధన జరుగుతుందని, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.