విశాఖ

నేటి నుంచి జనసేన సభ్వత్వ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూన్ 23: అరకులోయలో ఈ నెల 24వ తేది నుంచి జనసేన పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ నాయకులు చిట్టిబాబు, శ్రీరాం, బుజ్జి తెలిపారు. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సభ్యత్వాల నమోదును ప్రారంభించనున్నట్టు వారు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభ్వత్వాల నమోదును చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
క్వారీ అనుమతులు రద్దు చేయాలి
పాడేరు(రూరల్), జూన్ 23: హకుంపేట మండలం గూడ సమీపంలోని చట్టుమెట్ట వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర డిమాండ్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ క్వారీని శనివారం ఆయన సందర్శించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్వారీ వలన తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గిరిజనులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీ వలన పంట భూములు ఎడారిగా మారుతూ రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. గిరిజనులకు నష్టం కలిగించే విధంగా క్వారీ నిర్వహణ సరికాదని ఆయన అన్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీని నిలుపుదల చేయాలని ఆరు రోజులుగా గిరిజనులు ఆందోళన చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేస్తూ, గిరిజనులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. క్వారీ అనుమతులు రద్దు చేసే వరకు అందోళన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి క్వారీ అనుమతులు రద్దు చేయాలని సురేంద్ర డిమాండ్ చేసారు.