విశాఖపట్నం

28న గీతం నర్సింగ్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 14: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న బీఎస్సీ కోర్సుల్లో 2018 సంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ ఏడాది దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు నిర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కనకలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్షలో సైన్స్ సబ్జెక్ట్‌లతో 45 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ నర్సింగ్ బ్రిడ్జి కోర్సులో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు సైతం ఇందుకు అర్హులని పేర్కొన్నారు. కోర్సులో ప్రవేశానికి ఆగస్టు 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు గీతం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని, ఆగస్టు 18లోగా గీతం స్కూల్ ఆఫ్ నిర్సింగ్ ప్రన్సిపాల్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు.