విశాఖపట్నం

ఎండాడలో ఎంపీఎం ట్రస్టు వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, ఆగస్టు 14: ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంపీఎం ట్రస్టు ఎన్‌టీఆర్ సేవాట్రస్టుతో కలిసి సంయుక్తంగా 6వ వార్డు ఎండాడలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ఎంపీఎం ట్రస్టు విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని ట్రస్టు సభ్యుడు ఆళ్ల శ్రీనివాసరావు వెల్లడించారు. శిబిరంలో మూత్రపిండ సమస్యలు, స్ర్తి సంబంధ వ్యాధులు, క్షయ, గుండె జబ్బులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండాడలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యధికులు దంత, కంటి సమస్య బాధితులు పరీక్షలు చేయించుకున్నారు. గీతం దంత వైద్య కళాశాల, జిమ్‌సర్ ఆసుపత్రి సిబ్బంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చినగోపి, కే వీర్రాజు, రాంబాబు, అప్పలరాజు, పీవీ రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.