విశాఖపట్నం

ఎక్కడి రైళ్ళు అక్కడే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు రైళ్ళు రద్దు కాగా, కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్‌లు రీషెడ్యూల్ చేయబడ్డాయి. ఇంకొన్ని దారి మళ్ళింపులో నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా సోమవారం రోజంతా ఎక్కడి రైళ్ళు అక్కడే అన్నట్టుగా నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖల మధ్య కొన్ని నిలిచిపోగా, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే పలు రైళ్ళు గంటల తరబడి స్టేషన్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. వీటికి క్లియరెన్స్ లేక ఆలస్యంగా బయలుదేరి వెళ్ళాయి.
* మళ్ళింపు మార్గంలో వెళ్ళే రైళ్ళు...
హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22663) హౌరాలో సోమవారం ఖరగ్‌పూర్-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాలహర్సాల మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తుంది. సోమవారం బయలుదేరే హౌరా-హైదరాబాద్ (18645) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా కూడా ఖరగ్‌పూర్-టాటా-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్సాల మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తోంది. వీటితోపాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్ళింపులో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దిబ్రుగర్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (15906) దిబ్రుగర్‌లో సోమవారం బయలుదేరగా దీనిని పురులియా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ పురిలియాలో సోమవారం బయలుదేరింది. అయితే ఇది ఖరగ్‌పూర్-టాటా-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్హాల మీదుగా నడుస్తున్నట్టు వాల్తేరుడివిజన్ అధికారులు ప్రకటించారు. అలాగే పురిలియా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ పురిలియాలో సోమవారం బయలుదేరింది. ఇది కూడా హిజీ-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్సాల మీదుగా మళ్ళింపుమార్గంలోనే నడుస్తుంది.
* రీ షెడ్యూల్డ్ చేయబడినవి...
తుపాను కారణంగా గంటల తరబడి ఆలస్యమయ్యే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రీ షెడ్యూల్డ్ చేయబడ్డాయి. తిరుపతి-్భవనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (22872) తిరుపతిలో మధ్యాహ్నం 12.15గంటలకు బయలుదేరాల్సి ఉండగా దీనిని సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నారు. అలాగే కాచీగుడ-టాటా (07838) కాచీగుడ మధ్యాహ్నం ఒంటి గంటలకు కాచీగుడలో బయలుదేరాలి. అయితే దీనిని కూడా సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ నుంచి బయలుదేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో మరికొన్ని ముఖ్యమైన రైళ్ళు రీ-షెడ్యూల్ చేయబడ్డాయి. విశాఖపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17488) విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఇది సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి వెళ్లింది. విశాఖపట్నం-హజరత్ నిజాముద్ధీన్ దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్ (12861)ను రీ షెడ్యూల్ చేయడంతో మధ్యాహ్నం 3.05గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉన్న దీనికి రాత్రి 6.05గంటలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే విశాఖపట్నం-హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి సాయంత్రం 5.20గంటలకు బయలుదేరాల్సి ఉండగా రాత్రి 8.25గంటలకు బయలుదేరి వెళ్ళింది. విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (22869) విశాఖ నుంచి రాత్రి 10.05గంటలకు బయలుదేరి వెళ్ళింది. వాస్తవానికి ఇది రాత్రి 7.05గంటలకు బయలుదేరాల్సి ఉంది. అంటే మూడు గంటలపాటు ఆలస్యంగా బయలుదేరి వెళ్ళింది. దీంతోపాటు విశాఖపట్నం-రాజమండ్రి (67296) పాసింజర్ రాత్రి 6.20గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉండగా ఇది రాత్రి 9.20గంటలకు బయలుదేరి వెళ్ళింది.
* రైళ్ళ ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు...
గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోన్న రైళ్ళ వలన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. గమ్యానికి చేరుకోవాలనే ఆందోళనతో తామెక్కాల్సిన రైలు కోసం అవస్థలు పడాల్సి వచ్చింది. విశాఖ నుంచి భువనేశ్వర్, హౌరా వైపుగా వెళ్ళే రైళ్ళు, అలాగే రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, తిరుపతి తదితర ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు రీ షెడ్యూల్ చేయడంతో కనీసం మూడు గంటల నుంచి ఐదు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల స్టేషన్‌లోనే ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. తుపాను కారణంగా బలమైన ఈదురుగాలులతో ప్లాట్‌ఫారాలపై బిక్కుబిక్కుమంటూ కనిపించారు. వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది. బుధవారం రాత్రి నుంచి ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.