విశాఖపట్నం

పొట్టకొట్టిన పెథాయ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను కూలీల పొట్టకొట్టింది. పనుల్లేక వీరి కుటుంబాలు విలవిల్లాడిపోతున్నారు. రోడ్డెక్కలేక, ఇళ్ళల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి. మరెక్కడా లేనివిధంగా విశాఖ నగరంలోను, శివారుప్రాంతాల్లోనే బహుళ అంతస్తుల భవనాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఐటీ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. గత ఐదేళ్ళకాలం నుంచి నిర్మాణ రంగం వేగాన్ని అందుకుంది. దీంతో ఒడిశా, చత్తీస్‌గడ్, జయపూర్ రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, పలాస, సోంపేట, నరసన్నపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, పాలకొండ, బొబ్బిలి, సాలూరు తదర ప్రాంతాల నుంచి పనుల కోసం పొట్ట చేత పట్టుకుని విశాఖకు వచ్చిన కుటుంబాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులకు వర్షాభావ పరిస్థితులు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరవు కోరల్లో చిక్కుకున్న మధ్యతరగతి రైతు కుటుంబాలు చేసేదిలేక విశాఖవైపు పయలనమవుతుండగా ఈ విధంగా వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది నిర్మాణ రంగాల్లోను, విద్యాసంస్థల్లోను, ఐటీ రంగంలో చేరిపోతున్నారు. ఈ విధంగా మధురవాడ, ఆనందపురం, తగరపువలస, గాజువాక, పెందుర్తి, సింహాచలం తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుండగా వీటిల్లో పనులకు చేరిపోతున్న వీరందరికీ ఇపుడు తుపాను దెబ్బతీసింది. దాదాపు 20నుంచి 30 ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు, గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు, విద్యాసంస్థలు, ఐటీ రంగానికి చెందిన నిర్మాణ పనుల్లో ఉండేవారు 50నుంచి 60 శాతం మేర ఉంటారు. ఇపుడు వీరందరికీ పనుల్లేక విలవిల్లాడుతున్నారు. వలస కూలీలు, నిర్మాణ రంగ కార్మికులకు మరో రెండు రోజులపాటు ఆర్ధికపరమైన ఇబ్బందులు తప్టెటట్టు లేదు.
రేపు సింహాచలేశుని వైకుంఠ ద్వార దర్శనం
* మధ్యాహ్నం 11 గంటల వరకు ఉత్తర ద్వారంలో అప్పన్న * 3 గంటలకు కొండ మెట్ల దీపోత్సవం
* ఏర్పాట్లకు తుఫాన్ ఆటంకం * నేడు రాత్రి 7 గంటల వరకే దర్శనాలు
సింహాచలం, డిసెంబర్ 17: మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తకోటికి బుధవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలగనుంది. సూర్యోదయానికి ఏకాదశి తిధి ఉన్న రోజునే ప్రామాణికంగా తీసుకొని ఉత్సవాలు నిర్వహించడం సింహాచల క్షేత్రంలో ఆచారంగా వస్తున్న నేపథ్యంలో దేవాలయంలో బుధవారమే సింహాచలేశుని ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటి గంట సమయంలో సుప్రభాతం, ఆరాధన సేవ నిర్వహిస్తారు. తెల్లవారుజామున మూడు గంటలకు కొండ దిగువ సింహగిరి మెట్ల మార్గంలో దీపోత్సవాన్ని ప్రారంభిస్తారు. మూడున్నర గంటలకు ఆలయంలో స్వామివారి సేవ మొదలవుతుంది. సుమారు 4 గంటల 15 నిమిషాలకు దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఉత్తర ద్వారంలో అనుశంశిక ధర్మకర్తల కుటుంబానికి సంప్రదాయం ప్రకారం తొలిదర్శనం కల్పిస్తారు. అనంతరం వైకుంఠనాధుడిని భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారంలోకి తోడ్కొని వస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఆలంకరించిన వైకుంఠ వేదిక పై ఉత్సవమూర్తులను వేంచింపజేస్తారు. మధ్యాహ్నం 11 గంటల వరకు సింహాచలేశుడు ఉత్తర దార్వంలో భక్తులు దర్శించుకునే వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ల దీపోత్సవానికి అవసరమైన నూనె, వొత్తులు దేవస్థానమే ఉచితంగా పంపిణీ చేయనుంది. తెల్లవారు జామున నాలుగున్నర గంటల నుండి సింహగిరి పై సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ ఏకాదశి విశేష ప్రసాదమైన పొంగలిని పంపిణీ చేస్తున్నామని, అన్నప్రసాదంగా కూడా పొంగలి, పులుసు అందిస్తున్నామని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. క్యూలలో భక్తులు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వీక్షించే విధంగా సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల కదలికలను గమనించేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొండ దిగువన సింహగిరి పైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం అంబులెన్స్‌తో పాటు 108 వాహన సేవలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
* నేడు రాత్రి 7 గంటలకు దర్శనాలు నిలిపివేత : ముక్కోటి ఏకాదశి సన్నాహక చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే సింహాచలేశుని దర్శనాలు భక్తులకు లభిస్తాయని అనంతరం దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలియజేసారు. సింహగిరికి వాహనాలను కూడా 7 గంటల తరువాత అనుమతించడం జరగదని, బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మాత్రమే వాహనాలను సింహగిరికి అనుమతించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఏకాదశి ఉత్సవంలో భక్తులకు సేవలందించేందుకు వివిద ప్రభుత్వశాఖల అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చిండం జరిగిందని అధికారులు ప్రకటించారు. రెవిన్యూ, పోలీసు, జీవీఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక విభాగాల సహకారం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు అంతరాలయం వాటిల్లుతోంది. ఇప్పటికే భారీ క్యూలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పై షామియానాలు ఏర్పాటు చేయలేదు. గాలులు విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో ఎగిరిపోయే ప్రమాదం ఉనందున పరిస్థితి చక్కబడేంతవరకు ఎదురు చూస్తున్నారు. మంగళవారం తుఫాన్ ప్రభావం తగ్గితే మరింత వేగవంతంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు అన్ని సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నారు.

అప్పన్న సేవలో శ్రీకాకుళం జెడ్పీ చైర్మెన్
సింహాచలం, డిసెంబర్ 17: శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ సోమవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తీరుప్పావై ప్రవచానాలు ప్రారంభం
సింహాచలం, డిసెంబర్ 17: అడివివరం ప్రియాగార్డెన్స్‌లోని అపరాజిత ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచానాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామున సన్నిథిలో విశేష పూజలు,పారాయణలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనకారుడు డాక్టర్ శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలో ప్రారంభమైన తిరుప్పావై ప్రవచనాలలో జీ.నరసింహాచార్యులు, రఘనాథ గోపాలాచార్యులు, పద్మనాభాచార్యులు,శర్వాణీ, ధనలక్ష్మీ, హరిప్రియ, సాధకులు పాల్గొన్నారు.

ఏయూ స్నాతకోత్సవం వాయిదా
విశాఖపట్నం,డిసెంబర్ 17: ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదాపడింది. పెథాయ్ తుఫాను కారణంగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్ తెలిపారు. ఈ నెల 19న నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని తుఫాను కారణంగా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ, మెడల్స్,ప్రైజులు స్వీకరించేవారు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం తుఫాను కారణంగా రవాణా వ్యవస్థలకు సైతం పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిన్నింటిని పరిశీలించిన ఎటువంటి ఇబ్బందులు ఎదురువకుండా ముందు జాగ్రత్తగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, మార్పును గమనించాలన్నారు.
సామాజిక మార్పుకు కందుకూరి కృషి
* ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు
విశాఖపట్నం, డిసెంబర్ 17: సామాజిక మార్పుకు కందుకూరి వీరేశలింగం విశేష కృషి చేసారని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ తెలుగు శాఖలో కందుకూరి వీరేశలింగం రచనలు-సమాలోచన అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కందుకూరి ఆదర్శప్రాయడని, రచయితగా, కవిగా, సంస్కర్తగా విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా ఆయన నిర్వర్తించారన్నారు. ఆయనను స్మర్తిస్తూ విభాగంలో సదస్సు ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహన్‌రావు మాట్లాడుతూ స్ర్తిలకకు సమాజంలో భాగస్వాములను చేయడానికి అవసరమైన ఉద్యమానికి అధ్యుల్లో ఒకరిగా కందుకూరి వీరేశలింగం ఒకరన్నారు.స్ర్తి విద్య,పునర్వివాహం కోసం ఆయన చేసిన కృషి నిరూపమానమని, సాహిత్యంలో ఆడుగిడి, స్ర్తిల సమస్యలను సమన్వయం పట్ల విభాగ ఆచార్యులను అభినందించారు. విభాగంలో గురుజాడ, కందుకూరి పేరుతో సాహితి సదస్సులు నిర్వహించడం పట్ల విభాగ ఆచార్యులను అభినందించారు. విభాగ ఆచార్యులు ఆచార్య జి.యోహన్‌బాబు , విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, శరత్‌జ్యోత్న్స రాణి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర సాహిత్రి త్రైమాసిక సంచికలను వీసీ ఆవిష్కరించారు.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు
విశాఖపట్నం, డిసెంబర్ 17: పాత నగరంలో వేంచేసి యున్న శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం పదో రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి లక్ష్మీహోమం,వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహ విద్యాపారాయణ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో జ్యోతిమాధవి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వెంకటరమణ వారిచే అమ్మవారి చరిత్రపై బుర్రకధ నిర్వహించారు.
* నేడు అష్టదళ పద్మారాధన పూజ
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఉదయం అమ్మవారికి అష్టదళ పద్మారాధన పూజ నిర్వహించనున్నారు. స్వర్ణపుష్పార్చన(108 స్వర్ణపుష్పాలు)తో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ నిర్వహించనున్నామని ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. ఈ పూజలో పాల్గొనే వారంతా రూ.1.116 పూజా రుసుము చెల్లించి పాల్గొనవచ్చునన్నారు.
నేటి నుంచి విశాఖ వేదికగా ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోలీలు
విశాఖపట్నం, డిసెంబర్ 17: విశాఖ కేంద్రంగా 32వ ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీలు ఈ నెల 18 నుంచి 21 వరకూ నగరంలోని స్వర్ణ్భారతి ఇండోర్ మైదానంలో నిర్వహించనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఎం. ఎలీషా తెలిపారు. నగరంలోని ఎంవీపీ కాలనీలోని ప్రధాన పోస్టల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కబడ్డీ పోటీల్లో మొత్తం 11 జట్లు పాల్గొంటాయన్నారు. ఏపీ, తెలంగాణ,గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాళ్, తమిళనాడు, ఢీల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల జట్లు పోటీపడునున్నాయన్నారు. ఏపీ జట్టు సభ్యులతో పాటు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వారిలో జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడిన అనుభవం కల్గినవారన్నారు. ఈ పోటీలను విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభించనున్నారన్నారు. ఈ ప్రారంభ సభకి ఏపీ తపాలా విభాగం ఛీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణ్యన్ అధ్యక్షత వహిస్తారని, విశిష్ట అతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత(బాక్సింగ్) వెంకటేశ్వరరావు పాల్గొంటారన్నారు. అదే విధంగా పోటీల ముగింపు సభకు ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, ఒలింపిక్ మాజీ క్రీడాకారుడు ఎంవీ మాణిక్యాలు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సిహెచ్ పద్మరాజులు పాల్గొంటారన్నారు. భారతీయ తపాలా సంస్థ వివిధ క్రీడాంశాల్లో జాతీయ ,అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శించిన వారిని ప్రోత్సహించి, స్పోర్ట్స్ కోటా ప్రకారం సంస్థలో ఉద్యోగాలు సైతం కల్పించిందన్నారు.
ఏఆర్‌సి సంచాలకునిగా పుల్లారావు బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం,డిసెంబర్ 17: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్( ఏ ఆర్‌సీ) సంచాలకునిగా ఏయూ ఆర్థశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డి.పుల్లారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో సంచాలకునిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పుల్లారావును పలువురు ఆచార్యులు, విభాగ సిబ్బంది అభినందించారు.